Monday, April 13, 2009
ఉబ్బసం తో బాధ పడేవారికి
గ్యాస్ స్టవ్ మీద జిడ్డు పోవటం లేదా..!!
మీ గ్యాస్ స్టవ్ మీద, అరుగు మీద నూనె అంటి, ఎంత కడిగినా కూడా పోవటం లేదా..!! ఐతే మీకోసం ఒక "మన అమ్మ" చిట్కా..!! కొద్దిగా బియ్యంపిండి తీసుకొని స్టవ్ మీద, ఇంకా గ్యాస్ అరుగు మీద రుద్ది, మామూలుగా కడగండి.. జిడ్డు సులువుగా వదిలిపోతుంది.
డిన్నర్ ప్లేట్లపై పసుపు మరకలు పోవాలంటే !!
డిన్నర్ ప్లేట్లపై పసుపు మరకలు పోవాలంటే డిటర్జెంట్ సోప్తో పాటు గోధుమపిండి కలిపి రుద్దండి.అంతే..మీ డిన్నర్ ప్లేట్లు మళ్ళీ మామూలుగా తయారవుతాయి
Tuesday, March 17, 2009
అతిథిదేవో భవ ~:
ఆచార్య దేవో భవ ~:
"ఆచార్యుడు అనగా ఙ్ఞానమునిచ్చే గురువు అని అర్థము". సద్గురువునెలా పూజించాలో, సేవించాలో మనము తొలి పోస్ట్ లో కొంత తెలుసుకున్నాము. అంతేకాక మనకు ఙ్ఞానము తెలియ చేసే ప్రతీ వారిలో తమ గురువును చూడగలగాలి. గురువులోనే సర్వ దేవతలూ కొలువై ఉన్నారు.దీనికి నానుడిగా చిన్న ఉదాహరణ ఉన్నది. ఒక వ్యక్తి దగ్గరకు అతని గురువు , దైవము ఒకేసారి వచ్చారట. అతను ముందుగా గురువుకుసాష్టాంగవందనం చేసిన తరువాత, దైవానికి నమస్కారము చేశాడట...దీనిని బట్టి గురువేదైవం అని, స్పష్టంగా తెలుసుకోవచ్చు. పూర్వకాలం నుంచీ దేవతల అవతారాలెత్తిన శ్రీమహావిష్ణువు శ్రీక్రృష్ణ అవతారం లో సాందీపని, శ్రీరామ అవతారం లో వారి కుల గురువులైన వశిష్టులను, అస్త్ర విద్య నిచ్చిన శ్రీవిశ్వామిత్ర మహర్షిని సేవించిన సంగతి మనం తెలుసుకోవాలి. ఈ కలియుగంలో శ్రీరామ కృష్ణ పరమహంస "తోతాపురి" అనే గురువును, జగతికి హిందూమత విశిష్టతను తెలియచేసిన వివేకానందుడు శ్రీరామక్రిష్ణులను సేవించి, ముక్తి పథంవైపు పయనించిన సంగతి మనం గ్రహించి, ఆ మార్గంలో పయనించి పునీతులం కావాలి. అతిథిదేవోభవ గురించి తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో......
మాతృదేవోభవ - పితృదేవోభవ (భాగం -4)
మాతృదేవోభవ - పితృదేవోభవ (భాగం -3)
పాదాలమీద పడిన కౌశికుని చూసి "మహర్షీ ఈ శక్తి నాకు నా పతిభక్తి వలన లభించింది.నీవు కోరుకున్న ఙ్ఞానం కావాలంటే మిథిలా నగరంలో ధర్మవ్యాధుని వద్దకు వెళ్ళు" అని వినయము తో చెప్పింది.కౌశికుడు తన అహంకారము అంతా పోయి ఙ్ఞాన సముపార్జనకు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మ వ్యాధునికై వాకబు చేశాడు.దాని ప్రకారం వెళ్ళేసరికి ధర్మవ్యాధుడు మాంసం విక్రయిస్తూ కనిపించాడు.అది చూసిన కొఉశికుడు తన మనసులో "ఇతను చూస్తే నీచమైన మాంస వృత్తిలో జీవిస్తున్నాడు..ఇతను తనకేం ధర్మం బోధించగలడు" అనుకున్నాడు.కౌశికుని చూడగానే, ధర్మ వ్యాధుడు "మహర్షీ! నమస్కారములు..ఆ తల్లి సుమతీ మాత పంపగా వచ్చారా??! కాసేపు వేచి ఉంటే ఈ పని ముగించుకొని వస్తానని పలికాడు. కౌశికుడు ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనై, అక్కడ ఆ తల్లి, కాకి సంగతి చెప్పటం, ఇతనికి నా విషయం ముందే తెలియటం ఎంతో ఆశ్చర్యంగా ఉంది" అనుకుంటూ వేచి చూడసాగాడు.