Tuesday, March 17, 2009

ఆచార్య దేవో భవ ~:

"ఆచార్యుడు అనగా ఙ్ఞానమునిచ్చే గురువు అని అర్థము". సద్గురువునెలా పూజించాలో, సేవించాలో మనము తొలి పోస్ట్ లో కొంత తెలుసుకున్నాము. అంతేకాక మనకు ఙ్ఞానము తెలియ చేసే ప్రతీ వారిలో తమ గురువును చూడగలగాలి. గురువులోనే సర్వ దేవతలూ కొలువై ఉన్నారు.దీనికి నానుడిగా చిన్న ఉదాహరణ ఉన్నది. ఒక వ్యక్తి దగ్గరకు అతని గురువు , దైవము ఒకేసారి వచ్చారట. అతను ముందుగా గురువుకుసాష్టాంగవందనం చేసిన తరువాత, దైవానికి నమస్కారము చేశాడట...దీనిని బట్టి గురువేదైవం అని, స్పష్టంగా తెలుసుకోవచ్చు. పూర్వకాలం నుంచీ దేవతల అవతారాలెత్తిన శ్రీమహావిష్ణువు శ్రీక్రృష్ణ అవతారం లో సాందీపని, శ్రీరామ అవతారం లో వారి కుల గురువులైన వశిష్టులను, అస్త్ర విద్య నిచ్చిన శ్రీవిశ్వామిత్ర మహర్షిని సేవించిన సంగతి మనం తెలుసుకోవాలి. ఈ కలియుగంలో శ్రీరామ కృష్ణ పరమహంస "తోతాపురి" అనే గురువును, జగతికి హిందూమత విశిష్టతను తెలియచేసిన వివేకానందుడు శ్రీరామక్రిష్ణులను సేవించి, ముక్తి పథంవైపు పయనించిన సంగతి మనం గ్రహించి, ఆ మార్గంలో పయనించి పునీతులం కావాలి. అతిథిదేవోభవ గురించి తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో......

No comments:

Post a Comment