Tuesday, March 17, 2009

మాతృదేవోభవ - పితృదేవోభవ (భాగం -3)

పాదాలమీద పడిన కౌశికుని చూసి "మహర్షీ ఈ శక్తి నాకు నా పతిభక్తి వలన లభించింది.నీవు కోరుకున్న ఙ్ఞానం కావాలంటే మిథిలా నగరంలో ధర్మవ్యాధుని వద్దకు వెళ్ళు" అని వినయము తో చెప్పింది.కౌశికుడు తన అహంకారము అంతా పోయి ఙ్ఞాన సముపార్జనకు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మ వ్యాధునికై వాకబు చేశాడు.దాని ప్రకారం వెళ్ళేసరికి ధర్మవ్యాధుడు మాంసం విక్రయిస్తూ కనిపించాడు.అది చూసిన కొఉశికుడు తన మనసులో "ఇతను చూస్తే నీచమైన మాంస వృత్తిలో జీవిస్తున్నాడు..ఇతను తనకేం ధర్మం బోధించగలడు" అనుకున్నాడు.కౌశికుని చూడగానే, ధర్మ వ్యాధుడు "మహర్షీ! నమస్కారములు..ఆ తల్లి సుమతీ మాత పంపగా వచ్చారా??! కాసేపు వేచి ఉంటే ఈ పని ముగించుకొని వస్తానని పలికాడు. కౌశికుడు ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనై, అక్కడ ఆ తల్లి, కాకి సంగతి చెప్పటం, ఇతనికి నా విషయం ముందే తెలియటం ఎంతో ఆశ్చర్యంగా ఉంది" అనుకుంటూ వేచి చూడసాగాడు.

No comments:

Post a Comment