గృహిణులకు చిట్కాలు~:
పాలు విరుగుతాయని అనుమానం వచ్చినప్పుడు ఏం చేయాలో "మన అమ్మ" చిట్కా పాలు విరక్కుండా ఉండాలంటే, పాలల్లో 2 పుదీనా ఆకులు వేయాలి.
మన అమ్మ చేప్పే ముచ్హట్లు - యువతకు అందానికి మెరుగులు,గృహిణులకు చిట్కాలు,గర్భిణి స్త్రిలకు గృహ వైద్యము, ఆధ్యాత్మిక విషయములు,తెలుగు పాటలు, ఇంకా మరెన్నొ....ఇప్పుడు మన తెలుగు భాషలొ...
గృహిణులకు చిట్కాలు~:
పాలు విరుగుతాయని అనుమానం వచ్చినప్పుడు ఏం చేయాలో "మన అమ్మ" చిట్కా పాలు విరక్కుండా ఉండాలంటే, పాలల్లో 2 పుదీనా ఆకులు వేయాలి.
సౌందర్య చిట్కా~: అందమైన పాదాల కోసం
పాదాలు కోమలత్వాన్ని సంతరించుకోవటానికి ఏం చేయాలో "మన అమ్మ"చిట్కా లో తెలుసుకుందాం.ఇంతకు ముందు నేను చెప్పిన చిట్కా పాటిస్తూ, నిమ్మచెక్క తో పాదాలను రుద్దండి.ఇలా తరచూ చేయటంవల్ల పాదాలు తెల్లగా, కోమలంగా తయారవుతాయి.
సౌందర్య చిట్కా~: అందమైన పాదాల కోసం
అందమైన ముఖము, చేతులు తరువాత ప్రధాన దృష్టి పడేదీ ..పాదాల మీదే!!పాదాల అందం కోసం ఇంట్లోనే ఏం చేయాలో తెలుసుకుందాం "మన అమ్మ" చిట్కాలో.. పచ్చిపాలు, శనగపిండి మీ పాదాలకు సరిపడా తీసుకోండి.ఈ రెండింటి మిశ్రమాన్ని పాదాలకు రోజూ పట్టించి,ఆరాక మామూలుగా కడిగేసుకోండి.దీనివల్ల నల్లగా ఉన్న పాదాలు తెల్లబడతాయి.
సౌందర్య చిట్కా~: అందమైన చేతుల కోసం
చేతులు సౌందర్య భాగాల్లో ముఖ్యమైనవి గా చెప్పుకున్నాం కదా..ఈ పొస్ట్ లో కూడా ఒక మంచి సులువైన "మన అమ్మ"చిట్కాను చెప్పబోతున్నాను.ఏదైనా డిటర్జెంట్ మీ చేతులతో ఉపయోగించినప్పుడు పని పూర్తవ్వగానే నిమ్మచెక్కతో రుద్దండి. మీ చేతులు కోమలత్వంతో అందంగా తయారవుతాయి.
సౌందర్య చిట్కా~: అందమైన, ఆరోగ్యమైన కనులకోసం
కళ్ళు మన శరీరంలో ప్రధానమైనవి.అందుకే మన పెద్దలు "సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అన్నారు.మరి అంతటి ప్రాధాన్యం ఉన్న కనులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం? పాతకాలంలో ఐతే కళ్ళకు చక్కగా కాటుక పెట్టుకునేవారు స్త్రీలతో పాటు పురుషులు కూడా!!కానీ రాను రాను కాటుక పెట్టుకునే వారు తక్కువ అయ్యారనే చెప్పాలి.కాటుక లో ఉండే సుగుణాలు చెప్పటం అసాధ్యం.మన పెద్దలు ఏ పని చేసినా దానికి ఖచ్చితంగా ఒక మంచి కారణం ఉంటుంది.అందుకే ఈ పోస్ట్ లో నేను మీకు ఒక మంచి కాటుకకు సంబంధించిన చిట్కాను అందించబోతున్నాను.దీన్ని మీరే ఇంట్లో తయారుచేసుకుని మీ కళ్ళ సమస్యలను పోగొట్టుకోవచ్చు.దీన్ని ఎప్పటికప్పుడు తయారుచేసుకోవచ్చు.దీనికి కావలసినవి..పెద్ద ఉల్లిపాయ రసం, మంచి తేనె, ఒక్క నలుసు పచ్చ కర్పూరం.ఒక్క బొట్టు ఉల్లిరసం తీసుకుని ఒక ప్లేట్ లో వేసి అందులో ఒక్క చుక్క తేనె,ఒక్క నలుసు పచ్చ కర్పూరం వేసి బాగా కలిపితే కాటుక వస్తుంది. దీన్ని రోజూ కళ్ళకు పెట్టుకోవటం వల్ల కంట్లోని పొర, నలుసులు, దృష్టి లోపం వంటి సమస్యలు కేవలం 20 రోజుల్లోనే నివారించబడతాయి.
సౌందర్య చిట్కా~: అందమైన పెదవుల కోసం
పెదవులు అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి..!!కానీ ఈ రోజుల్లో భోజనం లో వచ్చిన మార్పులు, నిద్రలేమి, ఎక్కువ గాఢత కలిగిన పేస్ట్లు, రక్తహీనత వల్ల కూడా పెదవులు పాడవుతున్నాయి.పెదవులు తోలు ఊడిపోయి, చివరలు పగిలి, నల్లగా కళావిహీనంగా తయారవుతున్నాయి.కొద్దిపాటి ఖర్చు తోనే మనం ఈ సమస్యను అధిగమించవచ్చు.నాకు తెలిసిన , మనపూర్వీకుల నుండీ వస్తున్న ఒక మంచి ఆయుర్వేద చిట్కా ను మీకు కూడా చెప్పబోతున్నాను.ఆయుర్వేదం కూడా వేదాలలో ఒక భాగమే…అదేమిటో తెలుసుకుందాం "మన అమ్మ" చిట్కాలో..దీనికి కవలసిన పదార్ధాలు..జాజికాయ - 50గ్రా, పాలు- సరిపడా, దంచిన పసుపు - 50గ్రా, నాటు ఆవు నెయ్యి - 50గ్రా.జాజికాయలను పగలగొట్టి పై బెరడుని దంచి పొడి చేయాలి.తరువాత స్టవ్ వెలిగించి, ఒక గిన్నె లో పాలు పోసి పైన వస్త్రం కట్టాలి.ఈ వస్త్రం లో జాజికాయపొడిని వేయాలి.ఇలా ఒక 10నిమిషాలు ఉంచి , తీసి ఈ పొడిలో పసుపు కలిపి,గాజు సీసాలో నిల్వ చేసుకుని, పెదవులు నల్లగా ఉన్నవారు, పొక్కులు వచ్చిన వారు, అంచులు పగిలిన వారు రాత్రిపూట మాత్రమే నెయ్యిలో ఈ పొడిని తీసుకుని బాగా రంగరించి, పెదవులకు పట్టించి మృదువుగా మర్దనా చేయండి.దీనివల్ల పెదవులు తేనెలూరుతూ, ఎర్రగా నిగనిగలాడతాయి.
సౌందర్య చిట్కా~: అందమైన పెదవుల కోసం
సౌందర్య చిట్కా~: అందమైన చేతుల కోసం
చాలా మంది ముఖానికి ఇచ్చినంత ప్రాధాన్యం చేతులకు ఇవ్వరు.కానీ అందమైన ముఖం చూసాక అందరి దృష్టీ పడేది ప్రధానంగా చేతుల మీదే..మరి అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న చేతుల కోసం "మన అమ్మ" చిట్కా..రాత్రిపూట పడుకునే ముందుఆలివ్ ఆయిల్ తో కాసేపు మర్ధనా చేయండి.ఇలా చేస్తూ ఉన్నప్పుడే మీరు మార్పుని గమనించవచ్చు.కనీసం ఒక 40 రోజులపాటు చేసి చూడండి..ఉదయాన్నే మీ చేతులు కోమలంగా తయారవుతాయి.ఇంకా..డిటర్జెంట్ లాంటివి ఉపయోగించినప్పుడు తప్పనిసరిగా ఆలివ్ ఆయిల్ తో మర్దనా చేసుకోవటం మర్చిపోవద్దు.
(5 వ భాగం) మాతృదేవో భవ – గరుత్మంతుని మాతృభక్తి,శ్రీ మహావిష్ణు సాక్షాత్కారం
తన తల్లి ఐన వినత సమక్షం లో, పిన తల్లి ఐన కదృవను పిలిచి గరుత్మంతుడు ఈ విధంగా పలికాడు."పినతల్లీ!!నీవు కోరిన విధంగా అమృతం తెచ్చి ఇచ్చాను.నన్నూ, నా తల్లినీ, దాస్య విముక్తులను చేయమని" కోరాడు.అమృతమును చూసిన అనందం లో కదృవ, ఆ రోజు నుంచి వారిని దాస్య విముక్తులను చేసింది.ఆ తర్వాత కదృవ కుమారులంతా అమృతపానం చేయటానికి ముందుగా నదిలోకి స్నానం చేయటానికి వెళ్తారు.కదృవ, వినతకు చేసిన మోసం ఇంద్రునికి తెలుసు కాబట్టి వారికి అమృతభాండం దక్కకూడదని తిరిగి స్వర్గలోకానికి తీసుకు వెళ్ళిపోయాడు.ఆత్రంగా వచ్చిన కదృవ కొడుకులు దర్భల మీద అమృతభాండం లేకపోవటం చూసి ఆక్రోశించి, బాధపడి కొంచెం ఐనా దర్భల మీద అమృతం ఒలికిందేమోనని నాకారు.పదునుగా ఉన్న దర్భలవల్ల నాగుల నాలుక రెండుగా చీలింది.ఆనాటి నుంచి నాగజాతికి రెండు నాలుకలు యేర్పడ్డాయి.తల్లికి దాస్య విముక్తి చేసిన గరుత్మంతుడు స్వామి అనుగ్రహిస్తే సాక్షాత్త్ శ్రీ మహావిష్ణువుకు వాహనంగా ఉంటానని కోరాడు.గరుత్మంతుని మాతృభక్తికి మెచ్చుకుని,స్వామి,గరుక్మంతుణ్ణి వాహనంగా స్వీకరించారు.
తల్లిని గౌరవించి, ఆమెకు దాస్యవిముక్తిని చేసిన గరుత్మంతుడు స్థితికారుడైన శ్రీమన్నారాయణునికే వాహనమయ్యాడు.కనుక ప్రతివారూ ముందుగా తల్లిని పూజించి, గౌరవిస్తే ఉన్నత పదవులు వారి వద్దకే వెతుక్కుంటూ వస్తాయనటం లో సందేహం లేదు.
(4 వ భాగం) మాతృదేవో భవ – గరుక్మంతుని పుట్టుక,దాస్య విముక్తి
తనను దాస్యచెర నుండి విముక్తి చేసే కొడుకు కోసం వినతకి ఒక పుత్రుడు కలిగాడు.అతనే మహా పరాక్రమశాలి ఐన గరుక్మంతుడు.గరుక్మంతుడు పెద్దవాడు అయ్యాక, తాను తల్లి ఐన వినత, కద్రువకు, ఆమె పిల్లలకు ఎందుకు బానిసలుగా ఉన్నామని అడుగగా వినత గతంలో జరిగిన సంఘటనను వివరించింది.అది విని గరుక్మంతుడు పినతల్లి వద్దకు వెళ్ళి మమ్మల్ని ఈ దాస్యం నుండి విముక్తులను చేయమని అడిగాడు.కద్రువ ఆలోచించుకుని తన పిల్లలకు మరింత బలం చేకూరి అమరులుగా ఉండాలని ఆలోచించి, స్వర్గలోకంలో ఉన్న అమృతం తీసుకువచ్చి ఇస్తే, మీకు దాస్య విముక్తి చేస్తానని పలికింది. అది విన్న గరుక్మంతుడు సరే!అని పలికి స్వర్గలోకనికి వెళ్ళి అమృతకలశం దగ్గర ఉన్న కావలివారిని తన పరాక్రమంతో ఓడించి అమృతకలశం తీసుకువస్తుండగా ఇంద్రుడు వజ్రాయుధం విసిరాడు.ఇంద్రుడు వజ్రాయుధం మీద గౌరవం తో, తన రెక్కలోని ఒక ఈకను వజ్రాయుధానికి సమర్పించి గౌరవించాడు.ఇంద్రుడు, "వైనతేయుడు అనగా గరుక్మంతుడి" శక్తి పరాక్రమాలకు సంతోషించి ఈ విధంగా పలికాడు."నాయనా!!ఇది పవిత్రమైన అమృతభాండం. ఇది ఎట్టి పరిస్థితి లోనూ నీచులకు లభించరాదు".అని పలికి, కదృవ గరుక్మంతుని తల్లికి చేసిన మోసం గురించి కూడా తెలియచేసాడు ఇంద్రుడు.అప్పుడు గరుక్మంతుడు దాస్య విముక్తికై కదృవ అమృతం కోరిన సంగతి తెలిపి, ఇది నాకు కావలెనని అర్ధించాడు.ఇంద్రుడు సరేనని పలికి అమృతకలశాన్ని గరుక్మంతునికి జాగ్రత్తగా సమర్పించాడు.గరుక్మంతుడు అమృతకలశాన్ని తెచ్చి దర్భలు పరచి వాటి మీద పవిత్రమైన అమృతకలశాన్ని ఉంచాడు.పవిత్రమైన అమృతకలశం కదృవ పిల్లలకు అందిందో లేదో తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో...
(3 వ భాగం) మాతృదేవో భవ – అనూరుడి పుట్టుక
వినత తన స్థితికి బాధ పడుతూ, తనకి ఈ దాస్యం నుండి విముక్తి ఎప్పుడా?? అని విచారిస్తూ ఉండేది. కొంతకాలానికి వినత గర్భవతి అయ్యింది.కనీసం తనకు పుట్టే బిడ్డ ఐనా తనకు ఈ దాస్యచెర నుండి విముక్తి చేస్తాడనే ఆశ తో, నెలలు నిండినా కూడా ప్రసవం జరగకపోయేసరికి గర్భం పగలుకొట్టుకుంది.బయటకు వచ్చి, అప్పుడప్పుడే అవయవాలు ఏర్పడుతున్న ఆ బిడ్డ ఇంకా తొడల వరకు మాత్రమే ఏర్పడి అసంపూర్ణంగా ఉన్నాడు.బయటకు వచ్చిన ఆ బిడ్డ తల్లి చేసిన పనికి విచారించి, తన తల్లితో "అమ్మా!!ఎందుకు ఇంత తొందర పడ్డావు?అని ప్రశ్నించాడు".అప్పుడు వినత తన బాధ చెప్పుకుని , "నా దాస్యచెర నుండి విముక్తురాలిని చేస్తావనే ఆశతో తొందరపడ్డాను నాయనా" అని పలికింది. “అమ్మా!! నీవు చేసిన ఈ పని వల్ల కాళ్ళు పూర్తిగా ఏర్పడక ముందే పుట్టాను.అందువల్ల ఈ కార్యాన్ని నేను సాధించలేను.నిన్ను దాస్య విముక్తిని చేసేవాడు నీ కడుపున త్వరలో పుడతాడు.అతడు మహా బలశాలి, పరాక్రమవంతుడూ అవుతాడు.కనుక ఈసారి తొందరపడకుండా, అతను గర్భం లోనుండి సకాలంలో, సక్రమంగా పుట్టేంతవరకూ వేచి ఉండవలసింది"గా తన తల్లిని కోరి, తాను సూర్యుని రథసారధిగా ఉంటానని, ఆజ్ఞ ఇవ్వవలసిందిగా వేడుకున్నాడు.కొడుకు పలికిన మాటలకు వినత సంతోషించి దీవించింది.ఇతని పేరు అనూరుడు..అంటే తొడలు లేనివాడని అర్ధం.ఇతనే సూర్యభగవానుని రథసారథి.అనూరుడు పలికిన విధంగా వినతకు మరో బిడ్డ జన్మించి తనను దాస్యం నుండి విముక్తి కలిగించాడో లేదో తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో ....
(2 వ భాగం) మాతృదేవో భవ – కదృవ మోసం
అక్కడి నుంచి వినత వెళ్ళగానే కదృవ దీపం సహాయంతో ఆ గుఱ్ఱాన్ని మొత్తం వెతికింది.ఎక్కడా ఒఖ్ఖ మచ్చ కూడా కనిపించలేదు.కదృవకు భయం వేసింది..తాను వేసిన పందెం గురించి..ఈ విషయం వినత కు తెలిస్తే తాను జీవితాంతం వినతకు దాస్యం చేయాలి..ఎలాగైనా తాను ఈ పందెం లో ఓడిపోలేదని వినతను నమ్మించాలి..ఎలాగ?? అని ఆలోచిస్తున్న కదృవకు మెరుపు లాంటి ఆలోచన తట్టింది. ఆలోచన వచ్చిందే తడవు గా, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంటికి వచ్చి, తన పిల్లలైన నాగుల తో, తనకొచ్చిన కష్టం చెప్పుకొని ఎవరైనా ఎవరైనా వెళ్ళి గుఱ్ఱం తోక చివర చుట్టుకొని మచ్చలాగా కన్పించమని అడిగింది.కానీ ఆమె పిల్లలు అది ధర్మ విరుధ్ధమని, తాము అలా మోసం చేయలేమని తెగేసి చెప్పారు.అది విన్న కదృవ క్రోధంతో వారందరికీ శాపమివ్వబోతుండగా, ఆఖరి కుమారుడు వచ్చి "అమ్మా!! శాంతించు..నీ కోసం నేను ఈ పని చేస్తానని తల్లికి మాట ఇచ్చాడు.మరుసటి ఉదయం వినత, కదృవ గుఱ్ఱాన్ని పరీక్షించే సమయానికి కదృవ ఆఖరి కుమారుడు తన తల్లి చెప్పిన విధంగా తోకకు చుట్టుకొని కనిపించాడు. అది చూసిన కదృవ, వినతకు దూరం నుండి ఆ దృశ్యాన్ని చూపించి "చూడు చూడు..ఆ గుఱ్ఱానికి ఎంత పెద్ద మచ్చ ఉన్నదో!! కాబట్టి ఈ పందెం లో నేనే గెలిచాను.ఈ రోజు నుంచి నువ్వు నా దాసీవి అన్నది".పాపం ఇవేవీ తెలియని వినత తాను నిజంగానే పందెం లో ఓడిపోయానని, తొందరపడి పందెం కాసినందుకు విచారించి, ఆ రోజు నుంచి కదృవకు దాస్యం చేయ సాగింది.వినతకు ఈ దాస్యచెర నుంచి విముక్తి కలిగిందో లేదో తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో...
మాతృదేవో భవ - వినత,కదృవ పందెం..
పూర్వం కశ్యప ప్రజాపతి భార్యలైన వినత, కదృవ ఒకరోజున ముచ్చటించుకుంటున్నారు. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటటే, కదృవ నాగజాతికి జన్మనిచ్చింది. వినతకు ఇంకా సంతాన భాగ్యం కలుగలేదు. వారిద్దరూ ఒకరోజున తెల్లని, అందమైన గుఱ్ఱాన్ని చూసారు..వినత ఆ గుఱ్ఱాన్ని చూసి ముచ్చటపడి, "కదృవా!!ఆ గుఱ్ఱం చూడు.. ఎంతో అందంగా, ఒక్క మచ్చైనా లేకుండా చాలా తెల్లగా ఎంత బావుందో..అని ఆ గుఱ్ఱాన్ని చూసి మురిసిపోయింది. అది విన్న కదృవ "లేదు, లేదు ఆ గుఱ్ఱానికి ఒక నల్లని మచ్చ ఉన్నది అన్నది".ఈ విషయంలో ఇద్దరికీ వాదన, పంతం పెరిగాయి.ఇద్దరూ ఒక పందెం వేసుకున్నారు. గుఱ్ఱానికి మచ్చ ఉంటే వినత జీవితాంతం కదృవకు దాసీ గా ఉండాలి. మచ్చ లేకుంటే కదృవ, వినతకు జీవితాంతం దాసీ గా ఉండాలి..అని పందెం వేసుకున్నారు.పందెం ఐతే ఒప్పుకున్నది కానీ, కదృవకు కొంచెం భయం వేసి పైకి బింకం గా ఇప్పుడు చీకటి పడింది కదా!! రేపు చూద్దాం అని అప్పటికి తప్పించుకుంది. ఆ తరువాత ఏం జరిగిందో ఈ పందెం లో ఎవరు గెలిచారో తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో....
మనకు మహాభారతం ఎన్నో విషయాలను తెలియ చెప్పింది.మనుషులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అనే విషయాలను ఈ ఇతిహాసమును నిశితముగా గమనిస్తే ఎన్నో విషయాలు మనకు బోధపడతాయి.మనం తోటివారి పట్ల ఎలా ఉండాలో "విదురుడు" ఒక శ్లోకం ద్వారా చక్కగా చెప్పారు.పరుల ఏ పనుల వల్ల మనకు బాధ, దుఃఖం కలుగుతాయో, తిరిగి మనము ఆ పనులను పరులకు చేయకుండా ఉండటమే పరమ ధర్మమని విదురుడు బోధించాడు. ఈ విషయాన్ని మనకు చక్కటి పద్య రూపంలో వివరముగా చెప్పారు.మరి ఆ పద్యాన్ని మనము కూడా నేర్చుకుని మన పిల్లలకు కూడా నేర్పే ప్రయత్నం చేద్దాం..
"ఒరులేవి యొనరించిన
నరవర యప్రియము తనమనమునకు దా
నొరులకు నవిసేయ కునికి
పరాయణము పరమ ధర్మ పథముల కెల్లన్"
ఆణిముత్యంలాంటి ఈ పద్యం ప్రతివారు నేర్చుకుంటే, ఎదుటివారికి బాధ కలిగించే పనులు చేయకుండా ఉంటారు.కనుక ప్రతి తల్లి తమ పిల్లలకు చిన్న నాటి నుంచే ఇటువంటి మంచి విషయాలను నేర్పాలి.తద్వారా సమాజం కూడా బావుంటుంది.ఇంకా మరిన్ని ఆధ్యాత్మిక , మంచి, విషయాలను తెలుసుకుందాం.. తదుపరి పోస్ట్ లో....
సౌందర్య చిట్కా~: అందమైన మోము కోసం పచ్చిపాలతో..
ముఖం తెల్లగా ఉండాలని అందరికీ ఆశ గా ఉంటుంది.కానీ ఉన్న రంగులోనే ముఖం ఇంకొంచెం ఛాయ పెరిగేలా, ముఖం నునుపు గా వచ్చేలా చేయొచ్చు.అదేంటో తెలుసుకుందాం "మన అమ్మ" చిట్కా లో..
పచ్చిపాలు, మంచి గంధం సరిపడా తీసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాత్రమే కాక, మెడకు, చేతులకు పట్టించి ఆరాక చల్ల నీటితో కడిగేయండి. ఇది క్రమం తప్పకుండా ఒక నెల రోజులు వాడి చూడండి.. తేడా మీకే తెలుస్తుంది.ఇది ముఖానికి పట్టించి, ముఖాన్ని కడిగేశాక ముఖం ఎంత మెరుపు, నునుపును సంతరించుకుంటుందో తెలియాలంటే "మన అమ్మ" చిట్కాను పాటించి మీరంతా అందంగా తయారవుతారని ఆశిస్తున్నాను.
సౌందర్య చిట్కా~: అందమైన మోము కోసం.
ఇంట్లో దొరికే కూరలతోనే ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్ మీ కోసం "మన అమ్మ" చిట్కా లో..
టొమాటో, బీట్రూట్, క్యారట్ ఈ మూడిటిని మెత్తటి ముద్దచేసి, అందులో కొంచెం పాలమీగడ వేసి బాగా రుబ్బి, వీలు దొరికినప్పుడల్లా ఈ ఫేస్ ప్యాక్ ను పట్టించటం వల్ల ముఖం కాంతివంతంగా, ప్రకాశవంతంగా ఉంటుంది.
సత్సంగ మహిమ ~: సత్పురుషుల సాన్నిహిత్య మహిమ
విశ్వామిత్ర మహర్షి ఆలోచనలో పడతాడు..తాను ఎవరి దగ్గరైనా కల్మషం లేకుండా గడిపానా??. అని జ్ఞప్తికి తెచ్చుకుని, వశిష్ఠ మహర్షి పై విశ్వామిత్రునకు చాలా మత్సరం, అసూయ ఉండేవి.అందరూ ఆయనను "బ్రహ్మర్షి" అని, తనను "రాజర్షి" అని సంబోధిస్తారు. ఈ కోపంతో వశిష్ఠ మహర్షి యొక్క నూరు మంది కొడుకులను చంపాడు.అందువలన విశ్వామిత్రునకు బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకొని, పశ్చాత్తాపం తో, వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళి, తాను చేసిన పాపకార్యం చెప్పి, క్షమించమని వేడుకున్నాడు.వశిష్ఠ మహర్షి ఏమాత్రం కోపం లేనివాడై, ఈ విధంగా పలికాడు.
"మహర్షీ!! అన్నిటికీ అసూయే కారణం. అసూయను జయించలేకపోతే అన్నీ అనర్ధాలే". అని హితబోధ చేసి, విశ్వామిత్రుణ్ణి ఆదరించి క్షమించాడు. ఆయన దగ్గర తాను గడిపిన ఆ సమయం గుర్తుకు వచ్చి మనస్ఫూర్తిగా అహంకారం వదిలి ఆ పుణ్యఫలం ధారపోయగా భూమి పడిపోవటం ఆగిపోవటమే కాక, మరలా ఆదిశేషుని శిరస్సులపై భద్రంగా నిలిచింది.ఈ సంఘటనతో విశ్వామిత్రునకు ఙ్ఞానోదయం కలిగి తన ప్రశ్నకు సమాధానం దొరికింది.అంతేకాక తన తపః శక్తి అంతా కలిసినా వశిష్ఠ మహర్షి సమక్షంలో గడిపిన క్షణాల పుణ్యమే ఎక్కువ అని సత్సంగ మహిమ, విలువ కూడా తెలిసి అహంకారం తొలగింది.కనుక సత్ సాంగత్యం ఎంతటి పాపాన్నైనా దహించి మనసు నిర్మలమవ్వటమేకాక, మోక్షప్రాప్తికి కూడా సహకారిగా మారుతుంది.
గృహిణులకు చిట్కాలు~:
పంచదార బాటిల్ ను ఎంత జాగ్రత్తగా ఉంచినప్పటికీ చీమలు పట్టేస్తాయి.వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా!! ఐతే మీ కోసమే "మన అమ్మ" చిట్కా!!లవంగం మన అందరికీ తెలిసిందే కదా!!4,5 లవంగం మొగ్గలను పంచదార బాటిల్ లో వేయండి.అంతే.. చీమలు దాని దరి దాపుల్లోకి కూడా రావు.
గృహిణులకు చిట్కాలు~:
సింకు లో నీళ్ళు పోక అప్పుడప్పుడూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా!కొద్దిగా అడ్డుపడిన పదార్ధాలైతే నీళ్ళు బాగా ఫోర్స్ గా పోస్తే అడ్డు పోతుంది.కానీ అప్పటికీ పోకపోతే దీనికి ఏం చేయలో "మన అమ్మ" చిట్కా. ఒక మూత వెనిగర్ ని ఒక కప్పు నీళ్ళలో కలిపి సింకు మోరీ లో పోయండి.ఒక అరగంట పాటు వదిలేసి, తరువాత సులువు గా శుభ్ర పడుతుంది.
గృహిణులకు చిట్కాలు~:
రోజూ వండేదే ఐనా ఒక్కోసారి అన్నం ముద్ద ముద్దగా అవుతుంది. ఇది సర్వసాధారణం.కానీ ఆ రోజు ఇంట్లో వాళ్ళు సరిగ్గా భోజనం చేయకపోతే మనకే బాధ.అలా బాధ పడకుండా ఉండాలంటే "మన అమ్మ" చిట్కా!! అన్నం ఉడికేటప్పుడు కొంచెం నీరు ఉండగానే ఒక స్పూన్ వంటనూనె వేయండి.దీనివల్ల అన్నం పొడి పొడిగా, మల్లెపూవులా మెత్తగా కూడా ఉంటుంది.
గృహిణులకు చిట్కాలు~:
ఈ రోజుల్లో పెరగని నిత్యావసర వస్తువులు లేవు. మధ్య, పేద తరగతుల వారు కొనలేని పరిస్థితి.కానీ తప్పదు కదా!! నూనె కూడా చాలా ఖరీదు ఐంది.ఏవైనా నూనె పీల్చే పిండి వంటలు చేయాలంటే కొంచెం ఆలోచిస్తున్నాం కదా!! మరి అలా నూనె పీల్చకుండా ఉండాలంటే "మన అమ్మ" చిట్కా! బాండీలో నూనె పోసి అందులో కొద్దిగా ఉప్పు వేసి మీరు చేయాలనుకున్న వంటలు చేసుకోండి. దీనివల్ల నూనె ఎక్కువగా పీల్చదు. ప్రయత్నించి చూడండి.
గృహిణులకు చిట్కాలు~:
ఇప్పుడు కూరగాయల రేట్లు ఎంత మండిపోతున్నాయో మనందరికీ తెలిసిందే..అందులో టమాటాల ఖరీదు వేరే చెప్పనక్ఖర్లేదు.మరి అంత ఖరీదు పెట్టి కొనుక్కున్న టమాటాలు మెత్త మెత్తగా ఉంటే అటు పారేయలేము.. అలా అని ఉపయోగించుకోలేము.అలాంటప్పుడు ఏం చేయాలో "మన అమ్మ" చిట్కా!! ఉప్పు వేసిన నీటిలో ఒక రాత్రి నాన బెట్టండి. తరువాత రోజు మామూలుగా తయారవ్వటమే కాకుండా, 2,3 రోజుల వరకు బావుంటాయి.
పసి పిల్లల ఆహారం~: 6 నెలల పిల్లలకు ఇవ్వవలసిన ఆహారం “మన అమ్మ” చిట్కా లో
పిల్లల సంరక్షణ - పిల్లల పెంపకం~:
పిల్లల పెంపకం - పిల్లల సంరక్షణ పిల్లల ఆకలి పెరుగుదలకు~: 3 సంవత్సరాల పిల్లల నుంచి..
సాధారణంగా ఈ రోజుల్లో పిల్లలు వేళకు తినీ, తినక, అమ్మ అన్నీ చేసి పెట్టినా తినటానికి ఆకలి లేక, ఆకలి చచ్చిపోయి చిక్కిపోతూ ఉంటారు. అలాంటి పిల్లలకు ఈ పొస్ట్ లో "మన అమ్మ" ఒక మంచి చిట్కాను అందిస్తోంది..తల్లులు కూడా తమ పిల్లలు తినటం లేదని బాధ పడకుండా ఈ చిట్కాను ప్రయత్నించి చూడండి. సొంఠి మన అందరికీ తెలిసిందే..ఒక 100గ్రా తీసుకోని బాండీ లో కొంచెం 4,5 చుక్కలు నెయ్యి వేసి వేయించండి.తరువాత మిక్సి లో మెత్తగా పొడి చేయండి. దీన్ని నిలవ చేసుకొని ప్రతీ రోజూ మొదటి ముద్దలో అంటే.. ఒక నిమ్మకాయంత ముద్దలో ఒక చిటికెడు సొంఠిపొడి, కొంచెం నెయ్యి వేసి తినిపించండి. ఇలా చేయటం వల్ల జీర్ణ శక్తి మెరుగై, ఆకలి పెరిగి అన్నీ తింటారు. మీరు గుర్తుపెట్టులోవాల్సిన విషయం ఏంటంటే సొంఠిపొడి తింటున్నారు కదా.. అని ఇంకా ఎక్కువ వేస్తె బాగా వేడి చేసి మరొక సమస్య మొదలవుతుంది. కాబట్టి నేను చెప్పిన మోతాదులో దీన్ని ఉపయోగించుకొని మీరు, మీ పిల్లలు ఆనందంగా ఉంటారని ఆశిస్తూ తదుపరి పొస్ట్ లో జ్నాపక శక్తిని పెంచే మరొక అధ్భుతమైన అందమైన కానుక "మన అమ్మ" చిట్కాలో..
గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు~:అసలు గర్భ నిర్ధారణ చేసుకోవటం ఎలా???
కొంతమందికి గర్భదారణ జరిగినా కూడా ప్రతీనెలా ఋతుక్రమం (బహిష్టు) వస్తుంటుంది.దీనివలన వారు తమకు గర్భం వచ్చిందన్న సంగతి తెలుసుకోలేరు.మరి ఇలాంటి వారికి "మన అమ్మ" చిట్కా...!! ఇలాంటి లక్షణాలు కలిగిన అమ్మయిలకు కూడా, గర్భ ధారణ జరిగాక వేవిళ్ళు, వికారం, అతినిద్ర ఉంటాయి.అందువల్ల బహిష్టు వస్తున్నా కూడా ఈ లక్షణాలు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా ఒక చిన్నపాటి పరీక్ష ద్వారా మనము తెలుసుకోవచ్చు. దగ్గరలోని ఒక లాబ్ లో యూరిన్ ప్రెగ్నెన్సి టెస్ట్ చేయించుకుంటే తెలిసిపోతుంది..!! రిజల్ట్ పాజిటివ్ వస్తే మంచి గైనకాలజిస్ట్ను సంప్రదించి వారి సూచనల మేరకు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.ఇలా ప్రతి నెలా బహిష్టు కనిపిస్తిన్న వారికి ఏం చేయాలో ఇంతకు ముందు పొస్ట్ లో నేను చెప్పిన చిట్కా పాటించండి..
సౌందర్య కానుక~: కేశ సౌందర్యం కోసం
కలబంద నూనె తయారీ విధానాన్ని "మన అమ్మ" చిట్కాలో ఈ పొస్ట్ లో తెలుసుకుందాము.దీనికి కావలసిన పదార్ధాలు~: 1.కలబంద గుజ్జు- 1/4కేజి 2.కొబ్బరి నూనె-1/4 కేజి 3.మరుమం ఆకులు(వీటిని పూలల్లొ సువాసన కోసం కడతారు పూలు అమ్మే చోట దొరుకుతాయి). తయారీ విధానం~: ఒక బాండీ లో కొబ్బరి నూనె పోసి, కలబంద గుజ్జు కూడా పోసి, స్టవ్ మీద చిన్న మంట మీద పెట్టి, మాడకుండా కలయబెడుతూ ఉండండి. కలబంద గుజ్జు లోని సారమంతా నూనెలోకి ఇంకేవరకు, నూనె మాత్రమే మిగిలే వరకు ఉంచి దించేయండి.చివర్లో మరుమం ఆకులు వేయండి.వేడి చల్లరాక ఒక సీసాలో భద్రపరుచుకోండి.ఇంతే ...దీన్ని ప్రతీ ఒక్కరూ వాడవచ్చు.శరీరం లోని అతి వేడి ని కూడా తగ్గించి మెదడును ప్రశాంతంగా చేస్తుంది.ఐతే దీన్ని వాడే విధానం కూడా మీరు తెలుసుకోవాలి.రాత్రిపూట గోరువెచ్చగా చేసి, మునివేళ్ళతో మృదువు గా మర్దనా చేయండి.ఉదయాన్నేచక్కగా కుంకుడుకాయల తో తల స్నానం చేయండి.తల స్నానం చేసిన ప్రతీ సారీ మీ దిండు కవరు ను మార్చటం, అలాగే మీ దువ్వెనను శుభ్రం చేసుకోవటం మరచిపోవద్దు...!!( ఒక వేళ ఇలా చేయకపోతే మళ్ళి వాటిల్లోని మట్టి, చుండ్రు అంతా తిరిగి మీ జుట్టు లోకి వచ్చి సమస్యను అధికం చేస్తుంది. )ఇలా వారానికి 2 సార్లు తప్పని సరిగా చేయటం ద్వారా ఎప్పటికి తెల్ల వెంట్రుకలు రావు..చుండ్రు పూర్తిగా పోతుంది. జుట్టు రాలటం తగ్గుతుంది.మరి "మన అమ్మ" చెప్పిన ఈ చిట్కాను ఆచరించి మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను
సౌందర్య కానుక~: కేశ సౌందర్యం కోసం
కలబంద నూనె ..!!ఇది చాలా అద్భుతమైన కానుక!దీనివల్ల జుట్టు రాలటం, వెంట్రుకలు తెల్లబడటం, ఎఱ్ఱబడటం, చుండ్రు, ఇంకా తలలో వచ్చే అనేక కురుపులు, దురద వంటి సమస్యలు పోవటమే కాకుండా ఎప్పటికి రావు.మరి ఇంత అద్భుతమైన ఈ నూనెను ఎలా తయారు చేయాలో "మన అమ్మ" చిట్కాలో దీని తయారీ విధానాన్ని తెలుసుకుందాము...తదుపరి పొస్ట్ లో.....!!
సౌందర్య కానుక~: ముఖ సౌందర్యం కోసం
ముఖం మీద నల్లని, ఎఱ్ఱని, మొటిమల వల్ల వచ్చిన మచ్చలు వచ్చాయని బాధపడే వారి కోసం "మన అమ్మ" అద్భుతమైన సౌందర్య చిట్కా..!!దీనికి కావలసిన పదార్ధాలు~: 1.కలబంద గుజ్జు 2.పసుపు-1/4 చెంచా 3.మెంతి పొడి-1/2 చెంచా 4.జాపత్రి-1/2 చెంచా (జాపత్రి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది.) 5.ఉసిరి పొడి-1/2 చెంచా.తయారీ విధానం~: కలబంద గుజ్జు మీ ముఖానికి సరిపడా తీసుకుని అందులో ఈ 4 పొడులను కలిపి బాగా నూరండి.ముఖం మీద, మెడ మీడ మీద ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఒక గంట సేపు పట్టించండి.ఇది స్త్రీ,పురుషులు ఇద్దరూ వాడవచ్చు.దీన్ని ప్రతీ రోజూ వాడటంవల్ల ముఖము అతి ప్రకాశవంతముగా మారుతుంది...!! "మన అమ్మ" చెప్పిన ఈ చిట్కాను అందరూ వాడి అందాన్ని పొందుతారని ఆశిస్తూ..జుట్టు రాలకుండా ఉండేదుకు, తెల్లజుట్టు రాకుండా ఉండేదుకు కలబంద నూనే "మన అమ్మ" చిట్కాలో తదుపరి పొస్ట్ లో.......
సౌందర్య కానుక~: కేశ సౌదర్యం కోసం
ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలటం.కాని దీన్ని ఎలా అరికట్టాలో తెలియక తికమక పడుతూ ఉన్నట్టున్నారు..అలాంటి వారి కోసమే ఈ చిట్కా..!!ఒక కోడిగుడ్డు ను తీసుకోండి.తలస్నానం చేసే ఒక గంట ముందు ఎగ్గ్ లోని మిశ్రమం అంతా జుట్టు కుదుళ్ళకు బాగా అంటే విధంగా పట్టించండి.తరువాత ఎప్పటిలాగే మీ తలకు సరిపడిన ఒక మంచి హెర్బల్ షాంపూ తో తలస్నానం చేయండి.ఇలా వారానికి 2 సార్లు చేయండి.దీనితోపాటు ఆహారంలో కొన్ని మార్పులూ అవసరం..వారంలో 3 సార్లు ఖచ్చితంగా ఆకుకూరలు, రోజూ ఒక తాజా పండు, పెరుగు, పాలు తప్పనిసరి.అంతే కాక.. అతిగా ఆలోచించటం,వేళకు భోజనం చేయకపోవటం వంటివి మానుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం,వేళకు నిద్ర పోవటం వంటివి చేయాలి. మెరుగైన ఫలితాల కోసం నేను చెప్పిన ఆయిల్ మసాజ్ కూడా చేసి తరువాత ఈ చిట్కాను ఉపయోగించి చూడండి...ముఖం మీద మచ్చలు పోవటానికి మరొక అడ్భుతమైన కానుక "మన అమ్మ" చిట్కాలో తదుపరి పొస్ట్ లో.....
ఏంటి??మీ పిల్లలకు ఆకలి తగ్గిందా?ఏది తినిపిద్దామని చూసినా మొహం తిప్పేస్తున్నారా?ఐతే మీకోసమే మన "అమ్మ" చిట్కా!! వస కొమ్ము (కిరాణా, పచారీ షాపుల్లో దొరుకుతుంది). దీన్ని బాగా కడిగి, ఒక సాన మీద అరగదీసి (శనగగింజ అంత పరిమాణం)ఒక స్పూన్ లోకి తీసుకుని కొంచెం పాలు ఉగ్గు గిన్నె లోకి తీసుకొని, అరగదీసిన వసకొమ్ము రసాన్ని పాలలో కలిపి ఉగ్గు గిన్నె తో పసి పిల్లల నోట్లోకి పొయాలి.ఇది 3వ నెల వచ్చాక నెలా, 2నెలలకు ఇవ్వవచ్చు.మోషన్ వాసన(అజీర్తి)వస్తూ ఉన్నా, పైన చెప్పిన విధంగా చేసి చూడండి..తేడా మీకే తెలుస్తుంది.
ముఖము మంచి ఛాయ రావటానికి ఒక అందమైన "మన అమ్మ" చెప్పే చిట్కా!!ఇది కేవలము ముఖానికి మాత్రమే కాక, వంటికి కూడా ఉపయోగించండి. దీనికి కావలసిన పదార్ధాలు~:శనగ పిండి, నువ్వుల నూనె (మేలు రకం).కావలిసినంత శనగ పిండి తీసుకుని అండులో ముద్దకు వచ్చేటట్లు నువ్వుల నూనె కలిపి ప్రతీ రోజూ స్నానం చేసేటప్పుడు ఉపయోగించండి. తరువాత ఒక హెర్బల్ సబ్బు ని ఉపయోగించండి.ఇలా చేయటము వల్ల ఒక 40 రోజుల్లోనే తేడా చూస్టారు
3 నుంచి 5 నెలలవరకూపుట్టిన తరువాత సామాన్యంగా మూడు నెలల వరకు పసి బిడ్డకు పాలు సరిపోతాయి.తరువాత బిడ్డ ఎదుగుదలకు సిరిలాక్ యాపిల్ ఫ్లేవర్ మార్కెట్ లో దొరుకుతుంది..ఇది ఉదయం, సాయంత్రం ఇస్తూ తల్లిపాలు కూడా ఇవ్వాలి. ఎదైనా ఒక ఆకుకూర,క్యారట్,ఆలు వంటి ఆహారం కూడా ఇవ్వవచ్చు.ఎలాగంటే ..ఆకుకూర ఐతే 2,3 ఆకులు ఉప్పు వేసి ఉడికించి, ఉడికిన నీళ్ళు మాత్రమే తీసుకుని కొద్దిగ జారుడు గా చేసి పెట్టాలి. అదే క్యారట్,ఆలు ఐతే వీటిలో ఎదొ ఒక్కటి మాత్రమే తీసుకుని ఒక పావు ముక్క చొప్పున ఉప్పు వేసి ఉడికించి, గుజ్జు గా (పీచులు లేకుండా చేసి) తినిపించాలి.ఇది గట్టిగా ఉండకుండా మింగుడు పడటానికి వీలుగా ఊండేలా చూసుకుని పెట్టాలి.ఇలా రోజూ కొద్ద్ద్గా అలవాటు చేస్తూ ఉంటే మీ పిల్లలు బొద్దుగా,ముద్దుగా తయారవుతారు.కాని గుర్తుపెట్టుకోవలసిన విషయం అన్ని ఒకే సారి ఇవ్వకూడదు. పసిపిల్లల జీర్ణాశయానికి ఒక్కోటి .. అలవాటు చేయాలి.. మీ పిల్లల ఆకలి పెరగటాన్కి మంచి మన “అమ్మ” చిట్కా తదుపరి పొస్ట్ లో….!!