Friday, December 26, 2008

పాలు విరక్కుండా ఉండాలంటే.....

గృహిణులకు చిట్కాలు~:


పాలు విరుగుతాయని అనుమానం వచ్చినప్పుడు ఏం చేయాలో "మన అమ్మ" చిట్కా పాలు విరక్కుండా ఉండాలంటే, పాలల్లో 2 పుదీనా ఆకులు వేయాలి.

అందమైన పాదాల కోసం ....

సౌందర్య చిట్కా~: అందమైన పాదాల కోసం


పాదాలు కోమలత్వాన్ని సంతరించుకోవటానికి ఏం చేయాలో "మన అమ్మ"చిట్కా లో తెలుసుకుందాం.ఇంతకు ముందు నేను చెప్పిన చిట్కా పాటిస్తూ, నిమ్మచెక్క తో పాదాలను రుద్దండి.ఇలా తరచూ చేయటంవల్ల పాదాలు తెల్లగా, కోమలంగా తయారవుతాయి.

అందమైన పాదాల కోసం

సౌందర్య చిట్కా~: అందమైన పాదాల కోసం


అందమైన ముఖము, చేతులు తరువాత ప్రధాన దృష్టి పడేదీ ..పాదాల మీదే!!పాదాల అందం కోసం ఇంట్లోనే ఏం చేయాలో తెలుసుకుందాం "మన అమ్మ" చిట్కాలో.. పచ్చిపాలు, శనగపిండి మీ పాదాలకు సరిపడా తీసుకోండి.ఈ రెండింటి మిశ్రమాన్ని పాదాలకు రోజూ పట్టించి,ఆరాక మామూలుగా కడిగేసుకోండి.దీనివల్ల నల్లగా ఉన్న పాదాలు తెల్లబడతాయి.

అందమైన చేతుల కోసం...

సౌందర్య చిట్కా~: అందమైన చేతుల కోసం


చేతులు సౌందర్య భాగాల్లో ముఖ్యమైనవి గా చెప్పుకున్నాం కదా..ఈ పొస్ట్ లో కూడా ఒక మంచి సులువైన "మన అమ్మ"చిట్కాను చెప్పబోతున్నాను.ఏదైనా డిటర్జెంట్ మీ చేతులతో ఉపయోగించినప్పుడు పని పూర్తవ్వగానే నిమ్మచెక్కతో రుద్దండి. మీ చేతులు కోమలత్వంతో అందంగా తయారవుతాయి.

అందమైన, ఆరోగ్యమైన కనులకోసం ....

సౌందర్య చిట్కా~: అందమైన, ఆరోగ్యమైన కనులకోసం


కళ్ళు మన శరీరంలో ప్రధానమైనవి.అందుకే మన పెద్దలు "సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అన్నారు.మరి అంతటి ప్రాధాన్యం ఉన్న కనులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం? పాతకాలంలో ఐతే కళ్ళకు చక్కగా కాటుక పెట్టుకునేవారు స్త్రీలతో పాటు పురుషులు కూడా!!కానీ రాను రాను కాటుక పెట్టుకునే వారు తక్కువ అయ్యారనే చెప్పాలి.కాటుక లో ఉండే సుగుణాలు చెప్పటం అసాధ్యం.మన పెద్దలు ఏ పని చేసినా దానికి ఖచ్చితంగా ఒక మంచి కారణం ఉంటుంది.అందుకే ఈ పోస్ట్ లో నేను మీకు ఒక మంచి కాటుకకు సంబంధించిన చిట్కాను అందించబోతున్నాను.దీన్ని మీరే ఇంట్లో తయారుచేసుకుని మీ కళ్ళ సమస్యలను పోగొట్టుకోవచ్చు.దీన్ని ఎప్పటికప్పుడు తయారుచేసుకోవచ్చు.దీనికి కావలసినవి..పెద్ద ఉల్లిపాయ రసం, మంచి తేనె, ఒక్క నలుసు పచ్చ కర్పూరం.ఒక్క బొట్టు ఉల్లిరసం తీసుకుని ఒక ప్లేట్ లో వేసి అందులో ఒక్క చుక్క తేనె,ఒక్క నలుసు పచ్చ కర్పూరం వేసి బాగా కలిపితే కాటుక వస్తుంది. దీన్ని రోజూ కళ్ళకు పెట్టుకోవటం వల్ల కంట్లోని పొర, నలుసులు, దృష్టి లోపం వంటి సమస్యలు కేవలం 20 రోజుల్లోనే నివారించబడతాయి.

Thursday, December 25, 2008

అందమైన పెదవుల కోసం

సౌందర్య చిట్కా~: అందమైన పెదవుల కోసం


పెదవులు అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి..!!కానీ ఈ రోజుల్లో భోజనం లో వచ్చిన మార్పులు, నిద్రలేమి, ఎక్కువ గాఢత కలిగిన పేస్ట్లు, రక్తహీనత వల్ల కూడా పెదవులు పాడవుతున్నాయి.పెదవులు తోలు ఊడిపోయి, చివరలు పగిలి, నల్లగా కళావిహీనంగా తయారవుతున్నాయి.కొద్దిపాటి ఖర్చు తోనే మనం ఈ సమస్యను అధిగమించవచ్చు.నాకు తెలిసిన , మనపూర్వీకుల నుండీ వస్తున్న ఒక మంచి ఆయుర్వేద చిట్కా ను మీకు కూడా చెప్పబోతున్నాను.ఆయుర్వేదం కూడా వేదాలలో ఒక భాగమే…అదేమిటో తెలుసుకుందాం "మన అమ్మ" చిట్కాలో..దీనికి కవలసిన పదార్ధాలు..జాజికాయ - 50గ్రా, పాలు- సరిపడా, దంచిన పసుపు - 50గ్రా, నాటు ఆవు నెయ్యి - 50గ్రా.జాజికాయలను పగలగొట్టి పై బెరడుని దంచి పొడి చేయాలి.తరువాత స్టవ్ వెలిగించి, ఒక గిన్నె లో పాలు పోసి పైన వస్త్రం కట్టాలి.ఈ వస్త్రం లో జాజికాయపొడిని వేయాలి.ఇలా ఒక 10నిమిషాలు ఉంచి , తీసి ఈ పొడిలో పసుపు కలిపి,గాజు సీసాలో నిల్వ చేసుకుని, పెదవులు నల్లగా ఉన్నవారు, పొక్కులు వచ్చిన వారు, అంచులు పగిలిన వారు రాత్రిపూట మాత్రమే నెయ్యిలో ఈ పొడిని తీసుకుని బాగా రంగరించి, పెదవులకు పట్టించి మృదువుగా మర్దనా చేయండి.దీనివల్ల పెదవులు తేనెలూరుతూ, ఎర్రగా నిగనిగలాడతాయి.

అందమైన పెదవుల కోసం .....

సౌందర్య చిట్కా~: అందమైన పెదవుల కోసం


పెదవులు అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి..!!కానీ ఈ రోజుల్లో భోజనం లో వచ్చిన మార్పులు, నిద్రలేమి, ఎక్కువ గాఢత కలిగిన పేస్ట్లు, రక్తహీనత వల్ల కూడా పెదవులు పాడవుతున్నాయి.పెదవులు తోలు ఊడిపోయి, చివరలు పగిలి, నల్లగా కళావిహీనంగా తయారవుతున్నాయి.కొద్దిపాటి ఖర్చు తోనే మనం ఈ సమస్యను అధిగమించవచ్చు.నాకు తెలిసిన , మనపూర్వీకుల నుండీ వస్తున్న ఒక మంచి ఆయుర్వేద చిట్కా ను మీకు కూడా చెప్పబోతున్నాను.ఆయుర్వేదం కూడా వేదాలలో ఒక భాగమే…అదేమిటో తెలుసుకుందాం "మన అమ్మ" చిట్కాలో..దీనికి కవలసిన పదార్ధాలు..జాజికాయ - 50గ్రా, పాలు- సరిపడా, దంచిన పసుపు - 50గ్రా, నాటు ఆవు నెయ్యి - 50గ్రా.జాజికాయలను పగలగొట్టి పై బెరడుని దంచి పొడి చేయాలి.తరువాత స్టవ్ వెలిగించి, ఒక గిన్నె లో పాలు పోసి పైన వస్త్రం కట్టాలి.ఈ వస్త్రం లో జాజికాయపొడిని వేయాలి.ఇలా ఒక 10నిమిషాలు ఉంచి , తీసి ఈ పొడిలో పసుపు కలిపి,గాజు సీసాలో నిల్వ చేసుకుని, పెదవులు నల్లగా ఉన్నవారు, పొక్కులు వచ్చిన వారు, అంచులు పగిలిన వారు రాత్రిపూట మాత్రమే నెయ్యిలో ఈ పొడిని తీసుకుని బాగా రంగరించి, పెదవులకు పట్టించి మృదువుగా మర్దనా చేయండి.దీనివల్ల పెదవులు తేనెలూరుతూ, ఎర్రగా నిగనిగలాడతాయి.

అందమైన చేతుల కోసం ...

సౌందర్య చిట్కా~: అందమైన చేతుల కోసం


చాలా మంది ముఖానికి ఇచ్చినంత ప్రాధాన్యం చేతులకు ఇవ్వరు.కానీ అందమైన ముఖం చూసాక అందరి దృష్టీ పడేది ప్రధానంగా చేతుల మీదే..మరి అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న చేతుల కోసం "మన అమ్మ" చిట్కా..రాత్రిపూట పడుకునే ముందుఆలివ్ ఆయిల్ తో కాసేపు మర్ధనా చేయండి.ఇలా చేస్తూ ఉన్నప్పుడే మీరు మార్పుని గమనించవచ్చు.కనీసం ఒక 40 రోజులపాటు చేసి చూడండి..ఉదయాన్నే మీ చేతులు కోమలంగా తయారవుతాయి.ఇంకా..డిటర్జెంట్ లాంటివి ఉపయోగించినప్పుడు తప్పనిసరిగా ఆలివ్ ఆయిల్ తో మర్దనా చేసుకోవటం మర్చిపోవద్దు.

అందమైన మోము కోసం..

సౌందర్య చిట్కా~: అందమైన మోము కోసం

ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య "మొటిమలు".వీటి నివారణకు "మన అమ్మ" చిట్కాను తెలుసుకుందాం.. గులాబి, బచ్చలి ఆకులను తీసుకుని మెత్తగా రుబ్బి మొటిమల మీద రాస్తూ ఉంటే పదిహేను రోజుల్లోనే తేడాను గమనించవచ్చు.

Sunday, December 21, 2008

(5 వ భాగం) మాతృదేవో భవ – గరుత్మంతుని మాతృభక్తి,శ్రీ మహావిష్ణు సాక్షాత్కారం

(5 వ భాగం) మాతృదేవో భవ – గరుత్మంతుని మాతృభక్తి,శ్రీ మహావిష్ణు సాక్షాత్కారం

తన తల్లి ఐన వినత సమక్షం లో, పిన తల్లి ఐన కదృవను పిలిచి గరుత్మంతుడు ఈ విధంగా పలికాడు."పినతల్లీ!!నీవు కోరిన విధంగా అమృతం తెచ్చి ఇచ్చాను.నన్నూ, నా తల్లినీ, దాస్య విముక్తులను చేయమని" కోరాడు.అమృతమును చూసిన అనందం లో కదృవ, ఆ రోజు నుంచి వారిని దాస్య విముక్తులను చేసింది.ఆ తర్వాత కదృవ కుమారులంతా అమృతపానం చేయటానికి ముందుగా నదిలోకి స్నానం చేయటానికి వెళ్తారు.కదృవ, వినతకు చేసిన మోసం ఇంద్రునికి తెలుసు కాబట్టి వారికి అమృతభాండం దక్కకూడదని తిరిగి స్వర్గలోకానికి తీసుకు వెళ్ళిపోయాడు.ఆత్రంగా వచ్చిన కదృవ కొడుకులు దర్భల మీద అమృతభాండం లేకపోవటం చూసి ఆక్రోశించి, బాధపడి కొంచెం ఐనా దర్భల మీద అమృతం ఒలికిందేమోనని నాకారు.పదునుగా ఉన్న దర్భలవల్ల నాగుల నాలుక రెండుగా చీలింది.ఆనాటి నుంచి నాగజాతికి రెండు నాలుకలు యేర్పడ్డాయి.తల్లికి దాస్య విముక్తి చేసిన గరుత్మంతుడు స్వామి అనుగ్రహిస్తే సాక్షాత్త్ శ్రీ మహావిష్ణువుకు వాహనంగా ఉంటానని కోరాడు.గరుత్మంతుని మాతృభక్తికి మెచ్చుకుని,స్వామి,గరుక్మంతుణ్ణి వాహనంగా స్వీకరించారు.

తల్లిని గౌరవించి, ఆమెకు దాస్యవిముక్తిని చేసిన గరుత్మంతుడు స్థితికారుడైన శ్రీమన్నారాయణునికే వాహనమయ్యాడు.కనుక ప్రతివారూ ముందుగా తల్లిని పూజించి, గౌరవిస్తే ఉన్నత పదవులు వారి వద్దకే వెతుక్కుంటూ వస్తాయనటం లో సందేహం లేదు.

(4 వ భాగం) మాతృదేవో భవ – గరుక్మంతుని పుట్టుక,దాస్య విముక్తి

(4 వ భాగం) మాతృదేవో భవ – గరుక్మంతుని పుట్టుక,దాస్య విముక్తి


తనను దాస్యచెర నుండి విముక్తి చేసే కొడుకు కోసం వినతకి ఒక పుత్రుడు కలిగాడు.అతనే మహా పరాక్రమశాలి ఐన గరుక్మంతుడు.గరుక్మంతుడు పెద్దవాడు అయ్యాక, తాను తల్లి ఐన వినత, కద్రువకు, ఆమె పిల్లలకు ఎందుకు బానిసలుగా ఉన్నామని అడుగగా వినత గతంలో జరిగిన సంఘటనను వివరించింది.అది విని గరుక్మంతుడు పినతల్లి వద్దకు వెళ్ళి మమ్మల్ని ఈ దాస్యం నుండి విముక్తులను చేయమని అడిగాడు.కద్రువ ఆలోచించుకుని తన పిల్లలకు మరింత బలం చేకూరి అమరులుగా ఉండాలని ఆలోచించి, స్వర్గలోకంలో ఉన్న అమృతం తీసుకువచ్చి ఇస్తే, మీకు దాస్య విముక్తి చేస్తానని పలికింది. అది విన్న గరుక్మంతుడు సరే!అని పలికి స్వర్గలోకనికి వెళ్ళి అమృతకలశం దగ్గర ఉన్న కావలివారిని తన పరాక్రమంతో ఓడించి అమృతకలశం తీసుకువస్తుండగా ఇంద్రుడు వజ్రాయుధం విసిరాడు.ఇంద్రుడు వజ్రాయుధం మీద గౌరవం తో, తన రెక్కలోని ఒక ఈకను వజ్రాయుధానికి సమర్పించి గౌరవించాడు.ఇంద్రుడు, "వైనతేయుడు అనగా గరుక్మంతుడి" శక్తి పరాక్రమాలకు సంతోషించి ఈ విధంగా పలికాడు."నాయనా!!ఇది పవిత్రమైన అమృతభాండం. ఇది ఎట్టి పరిస్థితి లోనూ నీచులకు లభించరాదు".అని పలికి, కదృవ గరుక్మంతుని తల్లికి చేసిన మోసం గురించి కూడా తెలియచేసాడు ఇంద్రుడు.అప్పుడు గరుక్మంతుడు దాస్య విముక్తికై కదృవ అమృతం కోరిన సంగతి తెలిపి, ఇది నాకు కావలెనని అర్ధించాడు.ఇంద్రుడు సరేనని పలికి అమృతకలశాన్ని గరుక్మంతునికి జాగ్రత్తగా సమర్పించాడు.గరుక్మంతుడు అమృతకలశాన్ని తెచ్చి దర్భలు పరచి వాటి మీద పవిత్రమైన అమృతకలశాన్ని ఉంచాడు.పవిత్రమైన అమృతకలశం కదృవ పిల్లలకు అందిందో లేదో తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో...

(3 వ భాగం) మాతృదేవో భవ – అనూరుడి పుట్టుక

(3 వ భాగం) మాతృదేవో భవ – అనూరుడి పుట్టుక


వినత తన స్థితికి బాధ పడుతూ, తనకి ఈ దాస్యం నుండి విముక్తి ఎప్పుడా?? అని విచారిస్తూ ఉండేది. కొంతకాలానికి వినత గర్భవతి అయ్యింది.కనీసం తనకు పుట్టే బిడ్డ ఐనా తనకు ఈ దాస్యచెర నుండి విముక్తి చేస్తాడనే ఆశ తో, నెలలు నిండినా కూడా ప్రసవం జరగకపోయేసరికి గర్భం పగలుకొట్టుకుంది.బయటకు వచ్చి, అప్పుడప్పుడే అవయవాలు ఏర్పడుతున్న ఆ బిడ్డ ఇంకా తొడల వరకు మాత్రమే ఏర్పడి అసంపూర్ణంగా ఉన్నాడు.బయటకు వచ్చిన ఆ బిడ్డ తల్లి చేసిన పనికి విచారించి, తన తల్లితో "అమ్మా!!ఎందుకు ఇంత తొందర పడ్డావు?అని ప్రశ్నించాడు".అప్పుడు వినత తన బాధ చెప్పుకుని , "నా దాస్యచెర నుండి విముక్తురాలిని చేస్తావనే ఆశతో తొందరపడ్డాను నాయనా" అని పలికింది. “అమ్మా!! నీవు చేసిన ఈ పని వల్ల కాళ్ళు పూర్తిగా ఏర్పడక ముందే పుట్టాను.అందువల్ల ఈ కార్యాన్ని నేను సాధించలేను.నిన్ను దాస్య విముక్తిని చేసేవాడు నీ కడుపున త్వరలో పుడతాడు.అతడు మహా బలశాలి, పరాక్రమవంతుడూ అవుతాడు.కనుక ఈసారి తొందరపడకుండా, అతను గర్భం లోనుండి సకాలంలో, సక్రమంగా పుట్టేంతవరకూ వేచి ఉండవలసింది"గా తన తల్లిని కోరి, తాను సూర్యుని రథసారధిగా ఉంటానని, ఆజ్ఞ ఇవ్వవలసిందిగా వేడుకున్నాడు.కొడుకు పలికిన మాటలకు వినత సంతోషించి దీవించింది.ఇతని పేరు అనూరుడు..అంటే తొడలు లేనివాడని అర్ధం.ఇతనే సూర్యభగవానుని రథసారథి.అనూరుడు పలికిన విధంగా వినతకు మరో బిడ్డ జన్మించి తనను దాస్యం నుండి విముక్తి కలిగించాడో లేదో తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో ....

(2 వ భాగం) మాతృదేవో భవ – కదృవ మోసం

(2 వ భాగం) మాతృదేవో భవ – కదృవ మోసం


అక్కడి నుంచి వినత వెళ్ళగానే కదృవ దీపం సహాయంతో ఆ గుఱ్ఱాన్ని మొత్తం వెతికింది.ఎక్కడా ఒఖ్ఖ మచ్చ కూడా కనిపించలేదు.కదృవకు భయం వేసింది..తాను వేసిన పందెం గురించి..ఈ విషయం వినత కు తెలిస్తే తాను జీవితాంతం వినతకు దాస్యం చేయాలి..ఎలాగైనా తాను ఈ పందెం లో ఓడిపోలేదని వినతను నమ్మించాలి..ఎలాగ?? అని ఆలోచిస్తున్న కదృవకు మెరుపు లాంటి ఆలోచన తట్టింది. ఆలోచన వచ్చిందే తడవు గా, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంటికి వచ్చి, తన పిల్లలైన నాగుల తో, తనకొచ్చిన కష్టం చెప్పుకొని ఎవరైనా ఎవరైనా వెళ్ళి గుఱ్ఱం తోక చివర చుట్టుకొని మచ్చలాగా కన్పించమని అడిగింది.కానీ ఆమె పిల్లలు అది ధర్మ విరుధ్ధమని, తాము అలా మోసం చేయలేమని తెగేసి చెప్పారు.అది విన్న కదృవ క్రోధంతో వారందరికీ శాపమివ్వబోతుండగా, ఆఖరి కుమారుడు వచ్చి "అమ్మా!! శాంతించు..నీ కోసం నేను ఈ పని చేస్తానని తల్లికి మాట ఇచ్చాడు.మరుసటి ఉదయం వినత, కదృవ గుఱ్ఱాన్ని పరీక్షించే సమయానికి కదృవ ఆఖరి కుమారుడు తన తల్లి చెప్పిన విధంగా తోకకు చుట్టుకొని కనిపించాడు. అది చూసిన కదృవ, వినతకు దూరం నుండి ఆ దృశ్యాన్ని చూపించి "చూడు చూడు..ఆ గుఱ్ఱానికి ఎంత పెద్ద మచ్చ ఉన్నదో!! కాబట్టి ఈ పందెం లో నేనే గెలిచాను.ఈ రోజు నుంచి నువ్వు నా దాసీవి అన్నది".పాపం ఇవేవీ తెలియని వినత తాను నిజంగానే పందెం లో ఓడిపోయానని, తొందరపడి పందెం కాసినందుకు విచారించి, ఆ రోజు నుంచి కదృవకు దాస్యం చేయ సాగింది.వినతకు ఈ దాస్యచెర నుంచి విముక్తి కలిగిందో లేదో తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో...






(1 వ భాగం) మాతృదేవో భవ - వినత,కదృవ పందెం..

మాతృదేవో భవ - వినత,కదృవ పందెం..


పూర్వం కశ్యప ప్రజాపతి భార్యలైన వినత, కదృవ ఒకరోజున ముచ్చటించుకుంటున్నారు. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటటే, కదృవ నాగజాతికి జన్మనిచ్చింది. వినతకు ఇంకా సంతాన భాగ్యం కలుగలేదు. వారిద్దరూ ఒకరోజున తెల్లని, అందమైన గుఱ్ఱాన్ని చూసారు..వినత ఆ గుఱ్ఱాన్ని చూసి ముచ్చటపడి, "కదృవా!!ఆ గుఱ్ఱం చూడు.. ఎంతో అందంగా, ఒక్క మచ్చైనా లేకుండా చాలా తెల్లగా ఎంత బావుందో..అని ఆ గుఱ్ఱాన్ని చూసి మురిసిపోయింది. అది విన్న కదృవ "లేదు, లేదు ఆ గుఱ్ఱానికి ఒక నల్లని మచ్చ ఉన్నది అన్నది".ఈ విషయంలో ఇద్దరికీ వాదన, పంతం పెరిగాయి.ఇద్దరూ ఒక పందెం వేసుకున్నారు. గుఱ్ఱానికి మచ్చ ఉంటే వినత జీవితాంతం కదృవకు దాసీ గా ఉండాలి. మచ్చ లేకుంటే కదృవ, వినతకు జీవితాంతం దాసీ గా ఉండాలి..అని పందెం వేసుకున్నారు.పందెం ఐతే ఒప్పుకున్నది కానీ, కదృవకు కొంచెం భయం వేసి పైకి బింకం గా ఇప్పుడు చీకటి పడింది కదా!! రేపు చూద్దాం అని అప్పటికి తప్పించుకుంది. ఆ తరువాత ఏం జరిగిందో ఈ పందెం లో ఎవరు గెలిచారో తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో....




మాతృదేవో భవ~:

మాతృదేవో భవ~:

మన సమాజంలో తల్లికి ప్రధమస్థానం కల్పించారు. తల్లికి ఎందుకని అంతటి విశిష్ట స్థానం లభించింది?? తల్లి తన గర్భంలో శిశువు ఏర్పడ్డ దగ్గర నుంచి ఎన్నో కష్టాలను భరించి, మరో జన్మ అనిపించే ప్రసవ వేదనను భరించి, బిడ్డకు జన్మనిస్తుంది. అంతటి తో ఐపోలేదు..ఇంకా శ్రమకోర్చి బిడ్డ కోసం తను ఆహార నియమాలను పాటించి, తన రక్తాన్ని పాలుగా మార్చి, బిడ్డ కడుపు నింపుతుంది. బిడ్డ ఎదుగుదలను చూసి నిత్యం పరవశిస్తుంది. అందుకనే మాతృమూర్తికి మన భారతదేశం ప్రధమ స్థానం కల్పించింది.మరి అటువంటి మాతృమూర్తి సేవలో, తరించిన ఒక మహనీయుని గురించి తెలుసుకుందాం...తదుపరి పోస్ట్ లో...




తెలుగు ఆణిముత్యాలు - జీవన శైలి

మనకు మహాభారతం ఎన్నో విషయాలను తెలియ చెప్పింది.మనుషులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అనే విషయాలను ఈ ఇతిహాసమును నిశితముగా గమనిస్తే ఎన్నో విషయాలు మనకు బోధపడతాయి.మనం తోటివారి పట్ల ఎలా ఉండాలో "విదురుడు" ఒక శ్లోకం ద్వారా చక్కగా చెప్పారు.పరుల ఏ పనుల వల్ల మనకు బాధ, దుఃఖం కలుగుతాయో, తిరిగి మనము ఆ పనులను పరులకు చేయకుండా ఉండటమే పరమ ధర్మమని విదురుడు బోధించాడు. ఈ విషయాన్ని మనకు చక్కటి పద్య రూపంలో వివరముగా చెప్పారు.మరి ఆ పద్యాన్ని మనము కూడా నేర్చుకుని మన పిల్లలకు కూడా నేర్పే ప్రయత్నం చేద్దాం..

"ఒరులేవి యొనరించిన

నరవర యప్రియము తనమనమునకు దా

నొరులకు నవిసేయ కునికి

పరాయణము పరమ ధర్మ పథముల కెల్లన్"


ఆణిముత్యంలాంటి ఈ పద్యం ప్రతివారు నేర్చుకుంటే, ఎదుటివారికి బాధ కలిగించే పనులు చేయకుండా ఉంటారు.కనుక ప్రతి తల్లి తమ పిల్లలకు చిన్న నాటి నుంచే ఇటువంటి మంచి విషయాలను నేర్పాలి.తద్వారా సమాజం కూడా బావుంటుంది.ఇంకా మరిన్ని ఆధ్యాత్మిక , మంచి, విషయాలను తెలుసుకుందాం.. తదుపరి పోస్ట్ లో....


అందమైన మోము కోసం - పచ్చిపాలతో....

సౌందర్య చిట్కా~: అందమైన మోము కోసం పచ్చిపాలతో..


ముఖం తెల్లగా ఉండాలని అందరికీ ఆశ గా ఉంటుంది.కానీ ఉన్న రంగులోనే ముఖం ఇంకొంచెం ఛాయ పెరిగేలా, ముఖం నునుపు గా వచ్చేలా చేయొచ్చు.అదేంటో తెలుసుకుందాం "మన అమ్మ" చిట్కా లో..

పచ్చిపాలు, మంచి గంధం సరిపడా తీసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాత్రమే కాక, మెడకు, చేతులకు పట్టించి ఆరాక చల్ల నీటితో కడిగేయండి. ఇది క్రమం తప్పకుండా ఒక నెల రోజులు వాడి చూడండి.. తేడా మీకే తెలుస్తుంది.ఇది ముఖానికి పట్టించి, ముఖాన్ని కడిగేశాక ముఖం ఎంత మెరుపు, నునుపును సంతరించుకుంటుందో తెలియాలంటే "మన అమ్మ" చిట్కాను పాటించి మీరంతా అందంగా తయారవుతారని ఆశిస్తున్నాను.

అందమైన మోము కోసం.- టొమాటో, బీట్రూట్, క్యారట్...

సౌందర్య చిట్కా~: అందమైన మోము కోసం.


ఇంట్లో దొరికే కూరలతోనే ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్ మీ కోసం "మన అమ్మ" చిట్కా లో..


టొమాటో, బీట్రూట్, క్యారట్ ఈ మూడిటిని మెత్తటి ముద్దచేసి, అందులో కొంచెం పాలమీగడ వేసి బాగా రుబ్బి, వీలు దొరికినప్పుడల్లా ఈ ఫేస్ ప్యాక్ ను పట్టించటం వల్ల ముఖం కాంతివంతంగా, ప్రకాశవంతంగా ఉంటుంది.

Friday, December 12, 2008

సత్సంగ మహిమ ~: సత్పురుషుల సాన్నిహిత్య మహిమ

సత్సంగ మహిమ ~: సత్పురుషుల సాన్నిహిత్య మహిమ


విశ్వామిత్ర మహర్షి ఆలోచనలో పడతాడు..తాను ఎవరి దగ్గరైనా కల్మషం లేకుండా గడిపానా??. అని జ్ఞప్తికి తెచ్చుకుని, వశిష్ఠ మహర్షి పై విశ్వామిత్రునకు చాలా మత్సరం, అసూయ ఉండేవి.అందరూ ఆయనను "బ్రహ్మర్షి" అని, తనను "రాజర్షి" అని సంబోధిస్తారు. ఈ కోపంతో వశిష్ఠ మహర్షి యొక్క నూరు మంది కొడుకులను చంపాడు.అందువలన విశ్వామిత్రునకు బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకొని, పశ్చాత్తాపం తో, వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళి, తాను చేసిన పాపకార్యం చెప్పి, క్షమించమని వేడుకున్నాడు.వశిష్ఠ మహర్షి ఏమాత్రం కోపం లేనివాడై, ఈ విధంగా పలికాడు.

"మహర్షీ!! అన్నిటికీ అసూయే కారణం. అసూయను జయించలేకపోతే అన్నీ అనర్ధాలే". అని హితబోధ చేసి, విశ్వామిత్రుణ్ణి ఆదరించి క్షమించాడు. ఆయన దగ్గర తాను గడిపిన ఆ సమయం గుర్తుకు వచ్చి మనస్ఫూర్తిగా అహంకారం వదిలి ఆ పుణ్యఫలం ధారపోయగా భూమి పడిపోవటం ఆగిపోవటమే కాక, మరలా ఆదిశేషుని శిరస్సులపై భద్రంగా నిలిచింది.ఈ సంఘటనతో విశ్వామిత్రునకు ఙ్ఞానోదయం కలిగి తన ప్రశ్నకు సమాధానం దొరికింది.అంతేకాక తన తపః శక్తి అంతా కలిసినా వశిష్ఠ మహర్షి సమక్షంలో గడిపిన క్షణాల పుణ్యమే ఎక్కువ అని సత్సంగ మహిమ, విలువ కూడా తెలిసి అహంకారం తొలగింది.కనుక సత్ సాంగత్యం ఎంతటి పాపాన్నైనా దహించి మనసు నిర్మలమవ్వటమేకాక, మోక్షప్రాప్తికి కూడా సహకారిగా మారుతుంది.

సత్సంగ మహిమ ~: ఆదిశేషుడు-భూ భార బాధ్యత

సత్సంగ మహిమ ~: ఆదిశేషుడు-భూ భార బాధ్యత

వశిష్ట విశ్వామిత్రులలో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలని ఆదిశేషుని వద్దకు వచ్చిన విశ్వామిత్రునికి గట్టిపరీక్ష ఎదురైంది.తన ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు తన తలమీద భూమాతభారాన్నికాసేపు ఎవరైనా భరిస్తే మీకు సమాధానం చెప్తానని పలుకగా, విశ్వామిత్రుడు తన తపః శక్తిని వినియోగించి ఆ బాద్యతను నేను స్వీకరిస్తానని చెప్పి, ఆ ప్రయత్నం లో విఫలమౌతాడు.అప్పుడు ఆదిశేషుడు "మహర్షీ!!భూమి పడిపోతున్నది.ప్రళయం సంభవిస్తుంది.నీ మాట నమ్మి భూమిని దించాను.కనీసం భూమిని మరలా నా తలపై ఉంచు అన్నాడు".అది విని విశ్వామిత్రుడు ఏదైనా ఉపాయం చెప్పి నీవే ఈ ఉపద్రవాన్ని అరికట్టమని ప్రాధేయపడ్డాడు. అంతట "ఆదిశేషుడు నీ తపః శక్తి అంతా వ్యర్ధమైపోయింది.కానీ నీవు ఏ మహాపురుషుని వద్దనైనా నిష్కల్మషంగా గడిపితే అది ధారపోయి.భూగోళం మరలా నా శిరస్సులపై చేరుతుంది అని ఉపాయం చెప్పాడు".ఆ ఉపాయం ఏమిటో, ఈ ప్రయత్నం లో ఐనా విశ్వామిత్రుడు సఫలీకృతుడు అయ్యాడో లేదో తెలుసుకుందాం తదుపరిపోస్ట్ లో......

సత్సంగ మహిమ ~: ఆదిశేషుడు-విశ్వామిత్రుని సంభాషణ

సత్సంగ మహిమ ~:

విశ్వామిత్రుని చూసిన ఆదిశేషుడు "మహర్షీ!! మీ ప్రశ్నకు ఇప్పుడు నేను సమాధానం చెప్పలేను.నా తల మీద భూ భారం ఉంది.నేను ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా భూమి ఒరిగి అల్లకల్లోలం అవుతుంది.ఈ భారం ఎవరైనా కాసేపు మోస్తే నీ ప్రశ్నకు బదులు చెప్పగలనని అన్నాడు".అది విని "విశ్వామిత్రుడు ఎవరిదాకా ఎందుకు??నా తపః శక్తి కొంచెం ధారపోసి భూమిని నిలబెడతాను.కిందకు దించు అన్నాడు".సరే అని ఆదిశేషుడు భూమిని శూన్యంలోకి దించగానే భూమి పడిపోనారంభించింది.వెంటనే విశ్వామిత్రుడు తన తపః శక్తి లో పావు వంతు ధారపోసి భూగోళాన్ని నిలబెట్టాలని చూచాడు.ఐనా ఆగలేదు..ఇంకా పడిపోతున్నది.ఈసారి సగం తపః శక్తిని ధారపోశాడు....ఐనా లాభం లేక పొయింది.చివరిగా తాను ఎన్నో వేల సంవత్సరాలు కష్టపడి సాధించిన తపఃశక్తి మొత్తం ధారపోసి భూగోళాన్ని నిలబెట్టాలని ప్రయత్నించాడు విశ్వామిత్రుడు.ఐనా ఫలితం శూన్యం.తరువాత ఏం చేయాలో పాలుపోక ఆలోచించసాగాడు.. తన మాటను నమ్మి భూభారాన్ని తనకు అప్పగించిన ఆదిశేషుని మోము వంక చూడటానికే వణుకుపుట్ట సాగింది విశ్వామిత్రునికి..భూమిని నిలబెట్టాలని చూసిన విశ్వామిత్రుని ప్రయత్నం సఫలం ఐనదో లేదో తెలుసుకుందాం.. తదుపరి పోస్ట్ లో.....


సత్సంగ మహిమ~:విశ్వామిత్రుని సందేహం

సత్సంగ మహిమ~: విశ్వామిత్రుని సందేహం

సత్సంగం అనేది ఎంతో విలువైనది.దాని మహత్యం చెప్పనలవి కాదు.ఈ కలియుగం లో మానవులను ఎన్నో వ్యామోహాలు పట్టి పీడిస్తున్నాయి.ఈనాడు వృద్దులు కూడా మంచి విషయాలు తెలుసుకోవటానికి సిధ్దం గా ఉన్నా ఇంట్లో వ్యతిరేక ధోరణి ఉంటోంది.అటువంటిది ఇంకా యవ్వనం లో ఉన్నవాళ్ళు, చిన్నవాళ్ళకు మాత్రం దీని గురించి ఎలా తెలుస్తుంది???టి.వి.లో చెత్త సీరియల్స్, చెత్త కార్యక్రమాలు చూస్తూ మెదడును చెత్తకుండీగా చేసుకుంటున్నాం.కానీ ఒకసారైనా సత్సంగం గురించి మనందరం తెలుసుకుంటే కొంతలో కొంతైనా మంచిని అలవర్చుకోవటానికి దోహదపడుతుంది.అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఒకసారి విశ్వామిత్ర మహర్షికి ఒక సందేహం కలిగింది.అందరూ వశిష్ట మహర్షిని మాత్రమే ఎంతో గౌరవిస్తున్నారని, తనకు అంత గౌరవం లేదని అసూయ కలిగింది."నేను మాత్రం ఎందులో తక్కువ? తపోనిష్టుడనే కదా"??!!అని ఈ విషయమై మహర్షులను కలువగా, వారంతా ఆ ఆదిశేషుడే నీ ప్రశ్నకు సమాధానం చెప్పగలవాడని అన్నారు.విశ్వామిత్రుడు ఆదిశేషుని వద్దకు వెళ్ళాడు.ఆదిశేషుడు తల మీద భూభారం మోస్తున్నాడు.మరో ప్రక్క తన దేహమే పానుపుగా మలచి శ్రీలక్ష్మినారాయణనుకి కొలువుగా తీర్చాడు.అక్కడికి వచ్చిన విశ్వామిత్రుడు ఆదిశేషునికి అభివాదము చేసి,తన సందేహము అడిగాడు.నీవైనా వశిష్టుడు నాకంటే ఎందులో గొప్పవాడో చెప్పమని అడిగాడు.ఆ తరువాత ఏం జరిగిందో తదుపరి పోస్ట్ లో .....

Saturday, December 6, 2008

పంచదార బాటిల్ కు చీమలు పట్టకుండా...

గృహిణులకు చిట్కాలు~:


పంచదార బాటిల్ ను ఎంత జాగ్రత్తగా ఉంచినప్పటికీ చీమలు పట్టేస్తాయి.వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా!! ఐతే మీ కోసమే "మన అమ్మ" చిట్కా!!లవంగం మన అందరికీ తెలిసిందే కదా!!4,5 లవంగం మొగ్గలను పంచదార బాటిల్ లో వేయండి.అంతే.. చీమలు దాని దరి దాపుల్లోకి కూడా రావు.

సింకు లో నీళ్ళు పోక ఇబ్బంది పడుతున్నారా??

గృహిణులకు చిట్కాలు~:

సింకు లో నీళ్ళు పోక అప్పుడప్పుడూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా!కొద్దిగా అడ్డుపడిన పదార్ధాలైతే నీళ్ళు బాగా ఫోర్స్ గా పోస్తే అడ్డు పోతుంది.కానీ అప్పటికీ పోకపోతే దీనికి ఏం చేయలో "మన అమ్మ" చిట్కా. ఒక మూత వెనిగర్ ని ఒక కప్పు నీళ్ళలో కలిపి సింకు మోరీ లో పోయండి.ఒక అరగంట పాటు వదిలేసి, తరువాత సులువు గా శుభ్ర పడుతుంది.

అన్నం ముద్దగా అవుతోందా??

గృహిణులకు చిట్కాలు~:

రోజూ వండేదే ఐనా ఒక్కోసారి అన్నం ముద్ద ముద్దగా అవుతుంది. ఇది సర్వసాధారణం.కానీ ఆ రోజు ఇంట్లో వాళ్ళు సరిగ్గా భోజనం చేయకపోతే మనకే బాధ.అలా బాధ పడకుండా ఉండాలంటే "మన అమ్మ" చిట్కా!! అన్నం ఉడికేటప్పుడు కొంచెం నీరు ఉండగానే ఒక స్పూన్ వంటనూనె వేయండి.దీనివల్ల అన్నం పొడి పొడిగా, మల్లెపూవులా మెత్తగా కూడా ఉంటుంది.

నూనె పీల్చకుండా..

గృహిణులకు చిట్కాలు~:

ఈ రోజుల్లో పెరగని నిత్యావసర వస్తువులు లేవు. మధ్య, పేద తరగతుల వారు కొనలేని పరిస్థితి.కానీ తప్పదు కదా!! నూనె కూడా చాలా ఖరీదు ఐంది.ఏవైనా నూనె పీల్చే పిండి వంటలు చేయాలంటే కొంచెం ఆలోచిస్తున్నాం కదా!! మరి అలా నూనె పీల్చకుండా ఉండాలంటే "మన అమ్మ" చిట్కా! బాండీలో నూనె పోసి అందులో కొద్దిగా ఉప్పు వేసి మీరు చేయాలనుకున్న వంటలు చేసుకోండి. దీనివల్ల నూనె ఎక్కువగా పీల్చదు. ప్రయత్నించి చూడండి.

మెత్తబడిన టమాటాలకు ఒక మంచి చిట్కా!!!

గృహిణులకు చిట్కాలు~:

ఇప్పుడు కూరగాయల రేట్లు ఎంత మండిపోతున్నాయో మనందరికీ తెలిసిందే..అందులో టమాటాల ఖరీదు వేరే చెప్పనక్ఖర్లేదు.మరి అంత ఖరీదు పెట్టి కొనుక్కున్న టమాటాలు మెత్త మెత్తగా ఉంటే అటు పారేయలేము.. అలా అని ఉపయోగించుకోలేము.అలాంటప్పుడు ఏం చేయాలో "మన అమ్మ" చిట్కా!! ఉప్పు వేసిన నీటిలో ఒక రాత్రి నాన బెట్టండి. తరువాత రోజు మామూలుగా తయారవ్వటమే కాకుండా, 2,3 రోజుల వరకు బావుంటాయి.

కూరగాయలు వడలిపోయాయా??

గృహిణులకు చిట్కాలు~:

1.కూరగాయలు ఎక్కువగా కొని రోజూ వండుతున్నప్పటికీ, ఫ్రిజ్ లో పెట్టినా కూడ ఒక్కోసారి వడలిపోయినట్లుగా అవుతుంటాయి.అలా వడలిపోయినట్లు ఉంటే వాటిని తాజాగా చేసేందుకు ఒక చిట్కా.నిమ్మరసం వేసిన నీటిలో వాటిని ఒక రాత్రి నానబెట్టండి.మళ్ళీ తాజాను సంతరించుకుంటాయి

Sunday, November 30, 2008

6 నెలల పిల్లలకు ఇవ్వవలసిన ఆహారం

పసి పిల్లల ఆహారం~: 6 నెలల పిల్లలకు ఇవ్వవలసిన ఆహారం “మన అమ్మ” చిట్కా లో




ఒక 1/4 కేజి పాత బియ్యం,ఒక 2స్పూన్ల ఛాయ పెసరపప్పు, తీసుకొని బాండిలో కొంచెం వేడి చేసి, దించి మిక్సిలో రవ్వలాగా చేయాలి.దీన్ని ఒక బాటిల్ లో శుభ్రంగా నిల్వ చేసి, ప్రతిరోజూ ఒక 2,3 స్పూన్ల రవ్వను ఉప్పు చిటికెడు వేసి బాగా మెత్తగా కుక్కర్లో ఉడికించుకోవాలి.ఉడికాక తీసి స్పూన్ తో కలిపితే గుజ్జులా అవుతుంది.అప్పుడు దీనిలో కొద్దిగా నెయ్యి, శుభ్రం చేసిన వాము పొడి చిటికెడు కంటే తక్కువ గావేసి కలిపి పిల్లలకు తినిపిస్తూ, ఇంతకుముందు పొస్ట్ లో నేను చెప్పిన ఆకుకూరల సూప్ కూడా వారం లో 4 సార్లు ఖచ్చితంగా పెడుతూ, వాళ్ళ ఇష్టం గమనిస్తూ మధ్య మధ్య లో పప్పుకట్టు, చింతకాయ ఊరగాయ పలచగా కలిపి పెడుతూ ఉంటే పిల్లలూ ఇష్టం గా తింటారు..మీకు కూడా వాళ్ళు తింటున్న్రారన్న తృప్తి ఉంటుంది. సాయంత్రంపూట పసిపిల్లలకు ఇవ్వవలసిన ఆహారం ఏంటో తెలుసుకుందాము తదుపరి పొస్ట్ లో "మన అమ్మ" చిట్కాలో ...

పిల్లల మనో సౌందర్యానికి

పిల్లల సంరక్షణ - పిల్లల పెంపకం~:





పిల్లలకు సంభందించిన ఒక అధ్భుతమైన "మన అమ్మ"చిట్కాను ఈ పొస్ట్ లో చెప్పబోతున్నాను. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు తమ మాటలు వినటంలేదనీ, బాగా చదవటం లేదనీ, ప్రతీ దానికీ ఎదిరించి మాట్లాడుతున్నారనీ, ఈ చిన్న వయసులోనే విసుగు, కోపం ఎక్కువయ్యాయని చాలా మధన పడుతూ ఉంటారు..!!కానీ ఇక మీద మీరు బాద పడాల్సిన అవసరం లేదు.ప్రాచీన కాలం నుండీ ఎంతో మహానుభావులైన మన ఆయుర్వేద మహాఋషులు మనకు ఎన్నో కానుకలు అందించారు.కానీ వీటిని మనం గమనించుకోకుండా మందుల షాపుల చుట్టూ తిరుగుతున్నాము. దీనికి కావలసిన పదార్ధాలు మనకు దొరికేవే..
మీ పిల్లలకు తులసీ మాలను వెండి లేదా రాగి తీగ తో గానీ చుట్టించి ప్రతీ రోజూ ధరింపచేయండి.తులసి చెట్టు ఎంత పవిత్రమైనదో మనకు తెలిసిందే.ప్రతీ నిత్యం మనము పూజిస్తాము. తులసి లేని ఇంట్లో శ్రీ మహాలక్ష్మి కూడా నివసించదని మన పురాణాల్లొ చెప్పబడింది.దీన్నిబట్టి తులసి ప్రాముఖ్యత ఎంతో మనకు అర్ధమౌతుంది.దీనివల్ల పిల్లలకు మనసు ప్రశాంతం గా ఉండటమే కాక, చదువు మీద ఏకాగ్రతను,ఎవరి దగ్గర ఎలా మాట్లాడలో కూడా వారి బుద్దికి తెలిసే విధంగా చేస్తుంది.ఎదిరించి మాట్లాడే పిల్లలకు ఇది అద్భుతమైన కానుక.

పిల్లల ఆకలి పెరుగుదలకు~:

పిల్లల పెంపకం - పిల్లల సంరక్షణ పిల్లల ఆకలి పెరుగుదలకు~: 3 సంవత్సరాల పిల్లల నుంచి..

సాధారణంగా ఈ రోజుల్లో పిల్లలు వేళకు తినీ, తినక, అమ్మ అన్నీ చేసి పెట్టినా తినటానికి ఆకలి లేక, ఆకలి చచ్చిపోయి చిక్కిపోతూ ఉంటారు. అలాంటి పిల్లలకు ఈ పొస్ట్ లో "మన అమ్మ" ఒక మంచి చిట్కాను అందిస్తోంది..తల్లులు కూడా తమ పిల్లలు తినటం లేదని బాధ పడకుండా ఈ చిట్కాను ప్రయత్నించి చూడండి. సొంఠి మన అందరికీ తెలిసిందే..ఒక 100గ్రా తీసుకోని బాండీ లో కొంచెం 4,5 చుక్కలు నెయ్యి వేసి వేయించండి.తరువాత మిక్సి లో మెత్తగా పొడి చేయండి. దీన్ని నిలవ చేసుకొని ప్రతీ రోజూ మొదటి ముద్దలో అంటే.. ఒక నిమ్మకాయంత ముద్దలో ఒక చిటికెడు సొంఠిపొడి, కొంచెం నెయ్యి వేసి తినిపించండి. ఇలా చేయటం వల్ల జీర్ణ శక్తి మెరుగై, ఆకలి పెరిగి అన్నీ తింటారు. మీరు గుర్తుపెట్టులోవాల్సిన విషయం ఏంటంటే సొంఠిపొడి తింటున్నారు కదా.. అని ఇంకా ఎక్కువ వేస్తె బాగా వేడి చేసి మరొక సమస్య మొదలవుతుంది. కాబట్టి నేను చెప్పిన మోతాదులో దీన్ని ఉపయోగించుకొని మీరు, మీ పిల్లలు ఆనందంగా ఉంటారని ఆశిస్తూ తదుపరి పొస్ట్ లో జ్నాపక శక్తిని పెంచే మరొక అధ్భుతమైన అందమైన కానుక "మన అమ్మ" చిట్కాలో..

Tuesday, November 25, 2008

అసలు గర్భ నిర్ధారణ చేసుకోవటం ఎలా???

గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు~:అసలు గర్భ నిర్ధారణ చేసుకోవటం ఎలా???


కొంతమందికి గర్భదారణ జరిగినా కూడా ప్రతీనెలా ఋతుక్రమం (బహిష్టు) వస్తుంటుంది.దీనివలన వారు తమకు గర్భం వచ్చిందన్న సంగతి తెలుసుకోలేరు.మరి ఇలాంటి వారికి "మన అమ్మ" చిట్కా...!! ఇలాంటి లక్షణాలు కలిగిన అమ్మయిలకు కూడా, గర్భ ధారణ జరిగాక వేవిళ్ళు, వికారం, అతినిద్ర ఉంటాయి.అందువల్ల బహిష్టు వస్తున్నా కూడా ఈ లక్షణాలు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా ఒక చిన్నపాటి పరీక్ష ద్వారా మనము తెలుసుకోవచ్చు. దగ్గరలోని ఒక లాబ్ లో యూరిన్ ప్రెగ్నెన్సి టెస్ట్ చేయించుకుంటే తెలిసిపోతుంది..!! రిజల్ట్ పాజిటివ్ వస్తే మంచి గైనకాలజిస్ట్ను సంప్రదించి వారి సూచనల మేరకు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.ఇలా ప్రతి నెలా బహిష్టు కనిపిస్తిన్న వారికి ఏం చేయాలో ఇంతకు ముందు పొస్ట్ లో నేను చెప్పిన చిట్కా పాటించండి..

వేవిళ్ళకు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు

గర్బ్భిణి స్త్రీలకు~: వేవిళ్ళకు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు

నెల తప్పిన దగ్గర నుంచి గర్భవతికి మగతగా, నీరసంగా, కడుపులో తిప్పుతూ, ఉండి ఏమి తిన్నా ఇమడదు.తినటానికి ఏదీ హితవుగా అనిపించదు.నోరంతా అరుచిగా ఉంటుంది.కొంతమంది ఆడపిల్లలు ఇవన్నీ తెలియక తమకు ఏమైందోనని కంగారు పడుతూ ఉంటారు.కానీ కంగారు పడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఎందుకంటే ఇవన్నీ తల్లి కాబోతున్నారు అనటానికి సూచనలు..! మరి ఇలాంటి సంతోషకరమైన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో "మన అమ్మ" చిట్కా ద్వారా అమ్మయిలూ.. మీరంతా తెలుసుకోవాలి..!ఉదయాన్నే పరకడుపున, అంటే యేమీ తినకుండా కొంచెం అల్లం దంచి, 1గ్లాసు నీళ్ళలో వేసి, 1స్పూను దనియాలు, 1 స్పూను జీలకర్ర వేసి స్టవ్ మీద మరిగించి, ఈ కషాయాన్ని ఉదయం ఒక సారి, సాయంత్రం ఒకసారి తీసుకుంటే వేవిళ్ళు కొంత తగ్గి అన్నం హితవుగా ఉంటుంది. ఈ సమయంలో నిమ్మఊరగాయ పచ్చడి తప్ప మిగతావి తినకూడదు.మిగతా ఆహారం మామూలుగా తినవచ్చు.ఇంతకు ముందు నేను చెప్పిన కొన్ని ఆహార నియమాలు కూడా పాటించాలి. అసలు గర్భ నిర్ధారణ ఎలా చేసుకోవాలో.. గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము "మన అమ్మ" చిట్కాలో తదుపరి పోస్ట్ లో....

Monday, November 24, 2008

కేశ సౌందర్య కానుక తెల్ల జుట్టు రాకుండా.. ఉండేదుకు

సౌందర్య కానుక~: కేశ సౌందర్యం కోసం


కలబంద నూనె తయారీ విధానాన్ని "మన అమ్మ" చిట్కాలో ఈ పొస్ట్ లో తెలుసుకుందాము.దీనికి కావలసిన పదార్ధాలు~: 1.కలబంద గుజ్జు- 1/4కేజి 2.కొబ్బరి నూనె-1/4 కేజి 3.మరుమం ఆకులు(వీటిని పూలల్లొ సువాసన కోసం కడతారు పూలు అమ్మే చోట దొరుకుతాయి). తయారీ విధానం~: ఒక బాండీ లో కొబ్బరి నూనె పోసి, కలబంద గుజ్జు కూడా పోసి, స్టవ్ మీద చిన్న మంట మీద పెట్టి, మాడకుండా కలయబెడుతూ ఉండండి. కలబంద గుజ్జు లోని సారమంతా నూనెలోకి ఇంకేవరకు, నూనె మాత్రమే మిగిలే వరకు ఉంచి దించేయండి.చివర్లో మరుమం ఆకులు వేయండి.వేడి చల్లరాక ఒక సీసాలో భద్రపరుచుకోండి.ఇంతే ...దీన్ని ప్రతీ ఒక్కరూ వాడవచ్చు.శరీరం లోని అతి వేడి ని కూడా తగ్గించి మెదడును ప్రశాంతంగా చేస్తుంది.ఐతే దీన్ని వాడే విధానం కూడా మీరు తెలుసుకోవాలి.రాత్రిపూట గోరువెచ్చగా చేసి, మునివేళ్ళతో మృదువు గా మర్దనా చేయండి.ఉదయాన్నేచక్కగా కుంకుడుకాయల తో తల స్నానం చేయండి.తల స్నానం చేసిన ప్రతీ సారీ మీ దిండు కవరు ను మార్చటం, అలాగే మీ దువ్వెనను శుభ్రం చేసుకోవటం మరచిపోవద్దు...!!( ఒక వేళ ఇలా చేయకపోతే మళ్ళి వాటిల్లోని మట్టి, చుండ్రు అంతా తిరిగి మీ జుట్టు లోకి వచ్చి సమస్యను అధికం చేస్తుంది. )ఇలా వారానికి 2 సార్లు తప్పని సరిగా చేయటం ద్వారా ఎప్పటికి తెల్ల వెంట్రుకలు రావు..చుండ్రు పూర్తిగా పోతుంది. జుట్టు రాలటం తగ్గుతుంది.మరి "మన అమ్మ" చెప్పిన ఈ చిట్కాను ఆచరించి మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను

కేశ సౌందర్య కానుక కలబంద నూనె ఉపయోగాలు

సౌందర్య కానుక~: కేశ సౌందర్యం కోసం


కలబంద నూనె ..!!ఇది చాలా అద్భుతమైన కానుక!దీనివల్ల జుట్టు రాలటం, వెంట్రుకలు తెల్లబడటం, ఎఱ్ఱబడటం, చుండ్రు, ఇంకా తలలో వచ్చే అనేక కురుపులు, దురద వంటి సమస్యలు పోవటమే కాకుండా ఎప్పటికి రావు.మరి ఇంత అద్భుతమైన ఈ నూనెను ఎలా తయారు చేయాలో "మన అమ్మ" చిట్కాలో దీని తయారీ విధానాన్ని తెలుసుకుందాము...తదుపరి పొస్ట్ లో.....!!

ముఖ సౌందర్య కానుక

సౌందర్య కానుక~: ముఖ సౌందర్యం కోసం


ముఖం మీద నల్లని, ఎఱ్ఱని, మొటిమల వల్ల వచ్చిన మచ్చలు వచ్చాయని బాధపడే వారి కోసం "మన అమ్మ" అద్భుతమైన సౌందర్య చిట్కా..!!దీనికి కావలసిన పదార్ధాలు~: 1.కలబంద గుజ్జు 2.పసుపు-1/4 చెంచా 3.మెంతి పొడి-1/2 చెంచా 4.జాపత్రి-1/2 చెంచా (జాపత్రి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది.) 5.ఉసిరి పొడి-1/2 చెంచా.తయారీ విధానం~: కలబంద గుజ్జు మీ ముఖానికి సరిపడా తీసుకుని అందులో ఈ 4 పొడులను కలిపి బాగా నూరండి.ముఖం మీద, మెడ మీడ మీద ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఒక గంట సేపు పట్టించండి.ఇది స్త్రీ,పురుషులు ఇద్దరూ వాడవచ్చు.దీన్ని ప్రతీ రోజూ వాడటంవల్ల ముఖము అతి ప్రకాశవంతముగా మారుతుంది...!! "మన అమ్మ" చెప్పిన ఈ చిట్కాను అందరూ వాడి అందాన్ని పొందుతారని ఆశిస్తూ..జుట్టు రాలకుండా ఉండేదుకు, తెల్లజుట్టు రాకుండా ఉండేదుకు కలబంద నూనే "మన అమ్మ" చిట్కాలో తదుపరి పొస్ట్ లో.......

కేశ సౌందర్య కానుక జుట్టు రాలకుండా ఉండేదుకు..

సౌందర్య కానుక~: కేశ సౌదర్యం కోసం


ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలటం.కాని దీన్ని ఎలా అరికట్టాలో తెలియక తికమక పడుతూ ఉన్నట్టున్నారు..అలాంటి వారి కోసమే ఈ చిట్కా..!!ఒక కోడిగుడ్డు ను తీసుకోండి.తలస్నానం చేసే ఒక గంట ముందు ఎగ్గ్ లోని మిశ్రమం అంతా జుట్టు కుదుళ్ళకు బాగా అంటే విధంగా పట్టించండి.తరువాత ఎప్పటిలాగే మీ తలకు సరిపడిన ఒక మంచి హెర్బల్ షాంపూ తో తలస్నానం చేయండి.ఇలా వారానికి 2 సార్లు చేయండి.దీనితోపాటు ఆహారంలో కొన్ని మార్పులూ అవసరం..వారంలో 3 సార్లు ఖచ్చితంగా ఆకుకూరలు, రోజూ ఒక తాజా పండు, పెరుగు, పాలు తప్పనిసరి.అంతే కాక.. అతిగా ఆలోచించటం,వేళకు భోజనం చేయకపోవటం వంటివి మానుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం,వేళకు నిద్ర పోవటం వంటివి చేయాలి. మెరుగైన ఫలితాల కోసం నేను చెప్పిన ఆయిల్ మసాజ్ కూడా చేసి తరువాత ఈ చిట్కాను ఉపయోగించి చూడండి...ముఖం మీద మచ్చలు పోవటానికి మరొక అడ్భుతమైన కానుక "మన అమ్మ" చిట్కాలో తదుపరి పొస్ట్ లో.....

కేశ సౌందర్య కానుక మీ జుట్టు మెరుపు కోసం

సౌందర్య కానుక~: కేశ సౌందర్య కానుక మీ జుట్టు మెరుపు కోసం

మీ జుట్టు తలంటి పోసుకున్నా కూడా నిర్జీవం గా ఉందా??ఐతే మీ జుట్టు మెరుపు కు "మన అమ్మ" చిట్కా!!దీనివల్ల మీజుట్టుకు మెరుపు మాత్రమే కాక, మృదువు గా అవుతుంది..!! మామూలుగా మీ తలంటి అయ్యాక , చివర్లో ఒక నిమ్మచెక్క ను తీసుకొని ఒక మగ్గు గోరు వెచ్చని నీళ్ళలో పిండి, ఆ నీళ్ళను తలమీద పోసుకోండి.తరువాత మరొక మగ్గు మామూలు నీళ్ళను పోసుకోండి.ఇంతే మీరు చేయాల్సింది...ఎంత సులువో చూశారా!!ఇంకా మరిన్ని మెరుగైన ఫలితాలకై ఇంతకు ముందు నేను చెప్పిన ఆయిల్ మసాజ్ కూడా చేసి, తరువాత ఈ "మన అమ్మ" చిట్కా ను చేసి చూడండి. జుట్టు ఊడకుండా ఉండేదుకు ఒక కానుక "మన అమ్మ" చిట్కా ..తదుపరి పొస్ట్ లో.....

జుట్టు పెరగటానికి, చుండ్రు తగ్గటానికి...!!

కేశ సౌందర్య కానుక: జుట్టు పెరగటానికి, చుండ్రు తగ్గటానికి...!!

చాలా మందిని బాధ పెడుతున్న సమస్య చుండ్రు(డాండ్రఫ్).దీనివల్ల జుట్టు పెరగక పోగా, ఇంకా ఎక్కువ గా ఊడుతుంది.చలికాలం లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది.మరి దీనికి ఏం చేయాలో తోచక దిగులు పడుతున్నారా??దీనికోసమే "మన అమ్మ " చిట్కా!!ఇవి మీకు అందుబాటులో ఉండేవే..దీనికి కావలసిన పదార్దాలు~: వేపాకులు.మీరు తలంటి పోసుకునే రోజు కొన్ని వేపాకులు తీసుకొని ఒక గిన్నెడు నీళ్ళలో ఉడకబెట్టండి.బాగా మరిగితే నీళ్ళ రంగు మారుతుంది.మామూలుగా మీరు ఎప్పుడూ చేసే విధంగా తలంటి చేసి, చివరగా మరిగిన వేపాకు నీళ్ళు కొద్దిగ చల్లరాక తల మీద పోసుకోండి. ఇలా వారానికి 2 సార్లు చేయండి.దీనివల్ల మీ చుండ్రు తగ్గటమే కాకుండా జుట్టు పెరగుతుంది కూడా!!ఇంతకు ముందు నేను చెప్పిన ఆయిల్ మసాజ్ కూడా చేస్తూ తరువాత ఈ పధ్దతి పాటించి మీ కురులను ఆరోగ్యంగా ఉంచుకుంటారని ఆశిస్తూ జుట్టు మెరుపు కు మంచి కేశ సౌందర్య కానుక తదుపరి పొస్ట్ లో "మన అమ్మ" చిట్కా లో ...

Tuesday, November 18, 2008

అందమైన పట్టు లాంటి జుట్టు కోసం~:

చాలా మంది అందంగా ఉన్నా, జుట్టు మాత్రం గడ్డి లాగా ఉంటుంది.దీనితో వారు సహజం గా అందం గా ఉన్నా జుట్టుకు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో తెలియక దిగులు పడుతూ ఉంటారు.కొంచెం సమయమం కేటాయిస్తే అందమైన, పట్టు కుచ్చు లాంటి జుట్టు మీ సొంతం..!! అది ఎలా అంటే..తలంటి పోసుకునే ముందు రోజు రాత్రి ఆలివ్ ఆయిల్, ఆముదం, కొబ్బరినూనె ఈ మూడు సమభాగాలుగా తీసుకుని కొంచెం గోరు వెచ్చగా చేసి 5నుండి10 నిమిషాలు మునివేళ్ళతో మృదువు గా మసాజ్ చేయండి.తరువాత రోజు పొద్దున వీలైతే కుంకుడుకాయల తో కాని, మీ తలకి సరిపడిన మంచి మైల్డ్ అంటే ఎక్కువ కెమికల్స్ లేని షామ్పూ తో శుభ్ర పరుచుకోండి.ఇలా వారానికి 2 సార్లు చేయటం ద్వారా నెల తిరిగే సరికి మీ జుట్టు లోని మార్పు ను మీరే గమనిస్తారు.!!మీ జుట్టు కు మంచి మెరుపు రావటము కోసం ఏం చేయాలో తదుపరి పొస్ట్ లో....మన అమ్మ చిట్కా

పిల్లల ఆకలి పెరుగుదలకు – పసి పిల్లల ఆహార కానుక మన "అమ్మ చిట్కా!!


ఏంటి??మీ పిల్లలకు ఆకలి తగ్గిందా?ఏది తినిపిద్దామని చూసినా మొహం తిప్పేస్తున్నారా?ఐతే మీకోసమే మన "అమ్మ" చిట్కా!! వస కొమ్ము (కిరాణా, పచారీ షాపుల్లో దొరుకుతుంది). దీన్ని బాగా కడిగి, ఒక సాన మీద అరగదీసి (శనగగింజ అంత పరిమాణం)ఒక స్పూన్ లోకి తీసుకుని కొంచెం పాలు ఉగ్గు గిన్నె లోకి తీసుకొని, అరగదీసిన వసకొమ్ము రసాన్ని పాలలో కలిపి ఉగ్గు గిన్నె తో పసి పిల్లల నోట్లోకి పొయాలి.ఇది 3వ నెల వచ్చాక నెలా, 2నెలలకు ఇవ్వవచ్చు.మోషన్ వాసన(అజీర్తి)వస్తూ ఉన్నా, పైన చెప్పిన విధంగా చేసి చూడండి..తేడా మీకే తెలుస్తుంది.

అందమైన మోము కోసము

ముఖము మంచి ఛాయ రావటానికి ఒక అందమైన "మన అమ్మ" చెప్పే చిట్కా!!ఇది కేవలము ముఖానికి మాత్రమే కాక, వంటికి కూడా ఉపయోగించండి. దీనికి కావలసిన పదార్ధాలు~:శనగ పిండి, నువ్వుల నూనె (మేలు రకం).కావలిసినంత శనగ పిండి తీసుకుని అండులో ముద్దకు వచ్చేటట్లు నువ్వుల నూనె కలిపి ప్రతీ రోజూ స్నానం చేసేటప్పుడు ఉపయోగించండి. తరువాత ఒక హెర్బల్ సబ్బు ని ఉపయోగించండి.ఇలా చేయటము వల్ల ఒక 40 రోజుల్లోనే తేడా చూస్టారు

పసి పిల్లల ఆహార కానుక -మన "అమ్మ చిట్కా!!

3 నుంచి 5 నెలలవరకూపుట్టిన తరువాత సామాన్యంగా మూడు నెలల వరకు పసి బిడ్డకు పాలు సరిపోతాయి.తరువాత బిడ్డ ఎదుగుదలకు సిరిలాక్ యాపిల్ ఫ్లేవర్ మార్కెట్ లో దొరుకుతుంది..ఇది ఉదయం, సాయంత్రం ఇస్తూ తల్లిపాలు కూడా ఇవ్వాలి. ఎదైనా ఒక ఆకుకూర,క్యారట్,ఆలు వంటి ఆహారం కూడా ఇవ్వవచ్చు.ఎలాగంటే ..ఆకుకూర ఐతే 2,3 ఆకులు ఉప్పు వేసి ఉడికించి, ఉడికిన నీళ్ళు మాత్రమే తీసుకుని కొద్దిగ జారుడు గా చేసి పెట్టాలి. అదే క్యారట్,ఆలు ఐతే వీటిలో ఎదొ ఒక్కటి మాత్రమే తీసుకుని ఒక పావు ముక్క చొప్పున ఉప్పు వేసి ఉడికించి, గుజ్జు గా (పీచులు లేకుండా చేసి) తినిపించాలి.ఇది గట్టిగా ఉండకుండా మింగుడు పడటానికి వీలుగా ఊండేలా చూసుకుని పెట్టాలి.ఇలా రోజూ కొద్ద్ద్గా అలవాటు చేస్తూ ఉంటే మీ పిల్లలు బొద్దుగా,ముద్దుగా తయారవుతారు.కాని గుర్తుపెట్టుకోవలసిన విషయం అన్ని ఒకే సారి ఇవ్వకూడదు. పసిపిల్లల జీర్ణాశయానికి ఒక్కోటి .. అలవాటు చేయాలి.. మీ పిల్లల ఆకలి పెరగటాన్కి మంచి మన “అమ్మ” చిట్కా తదుపరి పొస్ట్ లో….!!

Sunday, November 16, 2008

దీపకుని కథ

కాశీ నగరము లోఅందరు దేవతలు నివాసమై ఉన్నారు.శ్రీ మహవిష్ణువు దీపకుని గురుభక్తికి ముగ్ధుడై దీపకుని వద్దకు వెళ్ళి "నాయనా!!నీ గురుభక్తికి మెచ్చాను.ఏమి వరం కావాలో కోరుకో!"అని పలికాడు శ్రీ మహావిష్ణువు.అప్పుడు దీపకుడు నమస్కరించి "స్వామి!మీ కోసంఎంత మంది తపస్సు చేసినా ప్రత్యక్శం కారు.మీ గురించి నేను ఏనాడూ తలచుకోలేదు..మరి నావద్దకు ఎందుకు వచ్చారు" అని అడిగాడు.అప్పుడు శ్రీ మహవిష్ణువు "నాయనా!గురువు ను సేవిస్తే మమ్ములను సేవించినట్లే" అని పలికి వరం కోరుకోమన్నాడు.అప్పుడు దీపకుడు "స్వామీ!నాకు ఏ వరాలూ వద్దు..అంతగా ఐతే మా గురువు గారి వ్యాధి తగ్గించమంటారేమో కనుక్కోని వస్తాను"అని వెళ్ళాడు.అప్పుడు గురువు "ఏమిరా!నాకు సేవ చేయటము కష్టమై వరంకోరుతున్నావా!నా పాపం నేనే అనుభవిస్తాను".అనగా దీపకుడు ఆ విషయం శ్రీమహవిష్ణువుకు చెప్పగా శ్రీహరి నిర్వాణ మండపం లో దేవతల సమక్శంలో కాశీ విశ్వనాధునికి ఈ విషయం చెప్పగా కాశీ విశ్వనాధుడు సంతోషించి శ్రీహరి తో కలిసి దీపకుని వద్దకు వచ్చి వరం కోరుకోమని పట్టుబట్టారు.వరం తప్పనిసరి ఐతే నా గురు భక్తి నిశ్చలం అయ్యేటట్లు,గురు కృప సదా నాకు కలిగేటట్లు దీవించమని పలికాడు.వారు తథాస్తు!అని సద్గురువు కు తాము ప్రతిరూపమని పలికి అంతర్దానమైనారు.వేదధర్మునికి వ్యాధి మాయమైంది.ఆయనకు ఆ వ్యాధి అనేది శిష్యులకు పెట్టిన పరీక్శ.ఈ పరీక్శలో దీపకుడు నెగ్గి గురువు వాత్సల్యాన్ని,అభయాన్ని పొంది అత్యంత శ్రేష్టుడైనాడు.

ఈ కలియుగంలో గురుభక్తి తో కలిగిన అనుభవాలను మీతో పంచుకుంటాను తదుపరి పొస్ట్ లో...

Saturday, November 15, 2008

దీపకుని కథ

ఇప్పటి వరకు మనము గురువు పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలని తెలుసుకున్నాము కదా!!ఇప్పుడు మీకు ఒక సందేహం ..ఇవన్ని వినటానికి ,చదవటానికి మాత్రమేనా??మాకు గురువు పట్ల అంత భక్తి కలగాలంటే ఏమన్నా నిదర్శనాలు ఉన్నాయా?అని మీరు అడగవచ్చు.నిరభ్యంతరంగా మీకు కలిగే ఈ ప్రశ్నలకు ఎన్నో సమాధానాలు మన పురాణాలలో ఉన్నాయి.అవి నేను కొన్ని చెప్పబోతున్నాను.అంతేకాక ఈ కలికాలంలో కూడా గురువును నమ్మి నేను పొందిన ,నాకు కలిగిన అనుభవాలను కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను.మరి సిధ్ధంగా ఉన్నారా??!! ఆధ్యాత్మికంసద్గురువు ను గురించి చెప్పటము ఎవరితరము కాదు. ఐనా ఆయన దయతో కలిగించిన ఈ అవకాశము ద్వారా నాకు లభించిన చిరు ఙ్నానం తో కొన్ని దివ్య కథలు తెలుసుకుందాం.పూర్వకాలంలో వేద ధర్ముడు అని ఒక గురువు గారి దగ్గర ఎంతో మంది శిష్యులు ఎంతో మంది శిష్యులు ఉండేవారు. వారిలో దీపకుడు ఎంతో శ్రద్ద తో గురువు గారి పట్ల వినయము తో ఉండేవాడు..ఒక రోజు గురువు గారు శిష్యుల భక్తి శ్రద్దలకు ఒక పరీక్ష పెట్టాలని ఈ విధంగా చెప్పారు.నాయనలారా!!పూర్వ జన్మ పాపం వల్ల నాకు ఇప్పుడు కుష్టు వ్యాధి కలగబోతున్నది.అందుచేత నేను సర్వపాపహరమైన కాశి లో ఉండి ఆ వ్యాదిని అనుభవించి నా పాపఫలాన్ని ఈ జన్మలోనే తొలగించుకుంటాను.మీలో ఎవరైనా నాకు ఆ సమయంలో సేవ చేయగలరాఅని ప్రశ్నించారు.శిష్యులంతా గురుసేవ లో యేమి లోపం కలుగుతుందో అని భయపడి వెనక్కు తగ్గారు.దీపకుడు మాత్రము గురువర్యా నేను తమరి సేవ చేసుకుంటాను.మీరు అనుమతి ఇస్తే ఆ పాపము నేను అనుభవిస్తాను అన్నాడు.గురువు గారు సంతోషించి నాయనా ఎవరి పాపము వారే అనుభవించాలి కాని, ఆ సమయము లో నేనెలా ఉంటానో నాకే తెలియదు అని చెప్పటము తో దీపకుడు గురువుగారికి నమస్కరించి గురు సేవకు పూనుకున్నాడు.తరువాత యేమి జరిగిందో తదుపరి పొస్ట్ లో తెలుసుకుందాము..




సద్గురువు ను ఎలా తెలుసుకోవాలి?

ఓం శ్రీ సాయి నాధాయ నమః

సద్గురువు ను ఎలా తెలుసుకోవాలి??ఇప్పుడు మనకు కొన్ని సందేహాలు కలుగుతున్నాయి కదా!!మాకు దైవ భక్తి ఉంది.మేమంతా రొజూ మా ఇష్ట దైవాలకు పూజలు చేసుకుంటున్నాము..ఇంకా గురువు,సద్గురువు అంటూ అవసరమా??అని కొన్ని సందేహాలు కలుగుతాయి.కాని ఇక్కడే మనము కొంచెం వివేకము తో ప్రవర్తించాల్సిన అవసరము ఉంది. భగవానుడు ఐన శ్రీక్రృష్ణ భగవద్గీత లో ఇలా చెప్పారు."నన్ను గురించి ఆలోచించేవారు కొందరు.కోటికి కొంతమంది నన్ను పొందాలని ప్రయత్నించినా వారు నన్ను పొందలేరు.నా తత్వాన్ని అర్దం చేసుకోలేరు.అందుకనే దేవతలు,అంటూ చాలామందికి పూజలు చేస్తూ ఉంటారు".అని చెప్పారు.మరలా శ్రీక్రృష్ణ భగవానుడే అందరిలో నన్ను చూడగలిగేవారు అన్ని జీవులలో ,పండితులలో నన్ను దర్సించేవారు ,జ్ఞానులు అని చెప్పి ,అటువంటి సడ్గురువులకు తనకు బేధం లేదనీ చెప్పియున్నారు.అందుకోసమే తాను స్వయం గా భగవంతుడైనా కూడా తనను అందరూ అనుసరించుటకు గాను సందీపని మహర్షి వద్ద ఎంతో వినయము తో శిష్యుని గా మసలుకొని లోకానికి గురుశిష్య సంబంధం గురించి తెలియ పరిచారు.గురువు పట్ల శిష్యుడు ఎంత వినయ విధేయలతో మెలగి ఙ్నానం గ్రహించాలో శ్రీరామ ,శ్రీక్రృష్ణ అవతారాల లో బోధించారు.

Friday, November 14, 2008

గర్భిణి స్త్రీలకు సూచనలు - జాగ్రతలు

గర్భిణీ స్త్రి ఆరోగ్య కానుక~:

అమ్మ అనిపించుకోటము కూడా ప్రతీ స్త్రీ కి ఒక వరము. మరి అంతటి అదృష్టాన్ని ,సంఘంలో మన గౌరవ మర్యాదలను నిలిపే అలాంటి గర్భమును ధరించాక ఎలాంటి జాగ్రత్త లు తీసుకోవాలో తెలియక గర్భస్రావాలు జరుగుతున్నాయి.మాత్రుత్వంలొని ఆనందాన్ని అనుభవించనీయకుండా పెనుభూతం లాంటి ఈ గర్భస్రావాన్ని ఎలా తప్పించుకోవాలో "మన అమ్మ" చెప్పే చిట్కా లో చూద్దాం!! పుదీనా ఆకు అందరికి అందుబాటులో ఉంటుంది.ఈ ఆకులను నలిపి గర్భంధరించిన 1 నుండి 3 లేక 5 నెలల వరకు దీని వాసన పీలుస్తూ ఉంటే రక్త స్రావం ఆగిపోయి గర్భం నిలబడుతుంది.అలాగే దీనితో పాటు చిన్న చిన్న జాగ్రత్తలూ అవసరం.అతి వేడి చేసే పదార్దాలు అంటే ఆవకాయ ,మామిడికాయ,ఆవపెట్టిన కూరలు ,నువ్వులు,బొప్పాయి వంటివి ఈ లేత నెలల్లొ తీసుకోకూడదు.

Wednesday, November 12, 2008

సౌందర్య కానుక -అందమైన మోము కొసము

అందమైన మోము కొసము~:
చాలా మంది నల్లగా ఉన్నామని బాధ పడుతూ ఉంటారు.అలాంటి వారి కోసమే ఈ "మన అమ్మ " చిట్కా!!దీనికి బ్యూటి పార్లర్ల చుట్టూ తిరిగి ఇప్పటికే చాలా సమయము ను , డబ్బు ను ఖర్చు చేసి ఉంటారు.కాని ఈ చిట్కా తో మీరు పడే శ్రమ కేవలము "మన అమ్మ " చిట్కా ను చదివి పాటించటము మాత్రమే.దీనికి కావలసిన పదార్దాలు~:1.పచ్చి పసుపు కొమ్ములు 2.నల్ల నువ్వులు(మంచి రకము)పచ్చి పసుపు కొమ్ములను శుభ్రము గా కడిగి,దంచి పొడి చేసుకొవాలి.అలాగే నల్ల నువ్వులను కూడా దంచి పొడి చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసా లో భద్ర పరుచుకోవాలి.ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ క్రమం తప్పకుండా పట్టించటము వల్ల పసుపు లోని పచ్చదనము అంతా ముఖము లోకి వస్తుంది.అంతకు ముందు మిమ్మల్ని చూసిన వారు ఈ చిట్కాను వాడిన తరువాత మీలో వచ్చే మార్పు ను చూసి ఆశ్చర్యపోవటము ఖాయం.పసుపు దాదాపు అన్ని చర్మ తత్వాలకు సరిపోతుంది.ఎక్కడో అరుదు గా మాకు పడదు అనుకున్నవారు ముందు మోచేతి మీద ప్రయత్నించి చూడండి.

Tuesday, November 11, 2008

ముఖ సౌందర్య కానుక~:

కానుక~:ముఖము మీద నల్ల మచ్చలు వున్నాయని బాధ పడె వారి కొసముపుదీన ఆకులను ముద్ద చేసి ముఖమునకు ఒక 40 రోజులు పట్టిన్చటము వల్ల ముఖముకు మంచి చాయ రావటమె కాకుండ మచ్చలు కూడా పోతాయి

Saturday, November 8, 2008

సద్గురువుని ఎలా తెలుసుకోవాలి?

మనకి మనమే వెతికితే మన అంచనా మన లాగా లోపభుఇష్టంగా వుంటుంది. ఆత్మ జ్ఞానానికి కృషిచేసేవాడు వేయి మంది లో ఒక్కడే వుంటారని శ్రీ కృష్ణ భగవానుడే స్వయముగా భగవద్గీతలో చెప్పారు. ఆ రోజుల్లోనే జ్ఞానులు అంత అరుదు ఐతే, ఈరోజుల్లో వీదికొకరు తాము భగవంతుని అవతారము అని చెప్పుకుంటున్నారు. మరి నిజమైన సద్గురువును లేక జ్ఞాని అంటే ఎవరు? వారిని మనం ఎలా తెలుసుకోగలం?
వెలుగు తానూ వెలుగు అని చాటుకోదు. నిజమైన సద్గురువు తాను గురువుని అని చాటుకోరు. సద్గురువు ప్రతీ జీవిని తన ప్రతిరూపముగా భావిస్తారు. బాహ్యఆడంబరాలకు తావివ్వకుండా నిజమైన ప్రేమను విశ్వాసాన్ని అర్పించిన వారికీ ఆభయమును ఇచ్చి, సర్వ వేళల యందును కాపాడి సకల కోరికలను నెరవేర్చువారే సద్గురువు.

Friday, November 7, 2008

శ్రీ గురుభ్యోనమః

" అభిష్ట కామప్రద కల్పవృక్షం
అనేక జన్మార్జిత పుణ్య లభ్యం
అశేష పాపానల భూరి వర్షం
నమామి నిత్యం సద్గురు సాయి పాదరేనుం "


ముందుగా మనము గురువు ని స్మరించుకుందాం. గురువు అనగా అజ్ఞానము అనే చీకటి ని పారద్రోలి జ్ఞాన జ్యోతి ని ప్రజ్వలింప చేయువాడె సద్గురువు. గురువు అని ఏ వస్తువుని నమ్మి సీవించినా, తీరని కోరికలు వుండవు. గురువుని పూజించిన వారికీ త్రిమూర్తులు కూడా వశులవుతారు. వారికీ ఇహ పరములో ఎటువంటి బాధలు కలగవు. నాలుగు పురుషార్ధాలు లభిస్తాయి. ఎటువంటి శాస్త్రముల తో పనిలేదు. కేవలము హృదయమును అర్పించి నిష్కల్మషముగా నమ్మి శ్రీ చరణములు శరణు వేడటమే. 
నెక్స్ట్ పోస్ట్ లో అలాంటి సద్గురువు ను ఎలా తెలుసుకోవాలో చెప్పుకుందాం.