Monday, April 13, 2009
ఉబ్బసం తో బాధ పడేవారికి
గ్యాస్ స్టవ్ మీద జిడ్డు పోవటం లేదా..!!
మీ గ్యాస్ స్టవ్ మీద, అరుగు మీద నూనె అంటి, ఎంత కడిగినా కూడా పోవటం లేదా..!! ఐతే మీకోసం ఒక "మన అమ్మ" చిట్కా..!! కొద్దిగా బియ్యంపిండి తీసుకొని స్టవ్ మీద, ఇంకా గ్యాస్ అరుగు మీద రుద్ది, మామూలుగా కడగండి.. జిడ్డు సులువుగా వదిలిపోతుంది.
డిన్నర్ ప్లేట్లపై పసుపు మరకలు పోవాలంటే !!
డిన్నర్ ప్లేట్లపై పసుపు మరకలు పోవాలంటే డిటర్జెంట్ సోప్తో పాటు గోధుమపిండి కలిపి రుద్దండి.అంతే..మీ డిన్నర్ ప్లేట్లు మళ్ళీ మామూలుగా తయారవుతాయి
Tuesday, March 17, 2009
అతిథిదేవో భవ ~:
ఆచార్య దేవో భవ ~:
"ఆచార్యుడు అనగా ఙ్ఞానమునిచ్చే గురువు అని అర్థము". సద్గురువునెలా పూజించాలో, సేవించాలో మనము తొలి పోస్ట్ లో కొంత తెలుసుకున్నాము. అంతేకాక మనకు ఙ్ఞానము తెలియ చేసే ప్రతీ వారిలో తమ గురువును చూడగలగాలి. గురువులోనే సర్వ దేవతలూ కొలువై ఉన్నారు.దీనికి నానుడిగా చిన్న ఉదాహరణ ఉన్నది. ఒక వ్యక్తి దగ్గరకు అతని గురువు , దైవము ఒకేసారి వచ్చారట. అతను ముందుగా గురువుకుసాష్టాంగవందనం చేసిన తరువాత, దైవానికి నమస్కారము చేశాడట...దీనిని బట్టి గురువేదైవం అని, స్పష్టంగా తెలుసుకోవచ్చు. పూర్వకాలం నుంచీ దేవతల అవతారాలెత్తిన శ్రీమహావిష్ణువు శ్రీక్రృష్ణ అవతారం లో సాందీపని, శ్రీరామ అవతారం లో వారి కుల గురువులైన వశిష్టులను, అస్త్ర విద్య నిచ్చిన శ్రీవిశ్వామిత్ర మహర్షిని సేవించిన సంగతి మనం తెలుసుకోవాలి. ఈ కలియుగంలో శ్రీరామ కృష్ణ పరమహంస "తోతాపురి" అనే గురువును, జగతికి హిందూమత విశిష్టతను తెలియచేసిన వివేకానందుడు శ్రీరామక్రిష్ణులను సేవించి, ముక్తి పథంవైపు పయనించిన సంగతి మనం గ్రహించి, ఆ మార్గంలో పయనించి పునీతులం కావాలి. అతిథిదేవోభవ గురించి తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో......
మాతృదేవోభవ - పితృదేవోభవ (భాగం -4)
మాతృదేవోభవ - పితృదేవోభవ (భాగం -3)
పాదాలమీద పడిన కౌశికుని చూసి "మహర్షీ ఈ శక్తి నాకు నా పతిభక్తి వలన లభించింది.నీవు కోరుకున్న ఙ్ఞానం కావాలంటే మిథిలా నగరంలో ధర్మవ్యాధుని వద్దకు వెళ్ళు" అని వినయము తో చెప్పింది.కౌశికుడు తన అహంకారము అంతా పోయి ఙ్ఞాన సముపార్జనకు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మ వ్యాధునికై వాకబు చేశాడు.దాని ప్రకారం వెళ్ళేసరికి ధర్మవ్యాధుడు మాంసం విక్రయిస్తూ కనిపించాడు.అది చూసిన కొఉశికుడు తన మనసులో "ఇతను చూస్తే నీచమైన మాంస వృత్తిలో జీవిస్తున్నాడు..ఇతను తనకేం ధర్మం బోధించగలడు" అనుకున్నాడు.కౌశికుని చూడగానే, ధర్మ వ్యాధుడు "మహర్షీ! నమస్కారములు..ఆ తల్లి సుమతీ మాత పంపగా వచ్చారా??! కాసేపు వేచి ఉంటే ఈ పని ముగించుకొని వస్తానని పలికాడు. కౌశికుడు ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనై, అక్కడ ఆ తల్లి, కాకి సంగతి చెప్పటం, ఇతనికి నా విషయం ముందే తెలియటం ఎంతో ఆశ్చర్యంగా ఉంది" అనుకుంటూ వేచి చూడసాగాడు.
Saturday, February 28, 2009
పూరీలు పొంగుతూ రావాలంటే....
గృహిణులకు చిట్కాలు~: పూరీలు పొంగుతూ రావాలంటే....
నోరూరించే పూరీలు మెత్తగా, హోటళ్ళలో లాగా పొంగుతూ తయారు చేయాలని అందరికీ ఉంటుంది..కానీ ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు..దీనికి సులువైన "మన అమ్మ "చిట్కా. పూరీ పిండి కలిపేటప్పుడు కొంచెం పంచదార వేసి కలపండి.
చపాతీలు మెత్తగా రావాలంటే..
చపాతీలు మెత్తగా రావాలంటే "మన అమ్మ" చిట్కా .. పిండి కలిపేటప్పుడు పావు స్పూను బేకింగ్ సోడా వేసి కలపండి.
మాతృదేవోభవ -పితృదేవోభవ (భాగం -2)
మాతృదేవోభవ -పితృదేవోభవ
లోపలికి వెళ్ళిన సుమతి భిక్ష తెచ్చేంతలో ఆమె భర్త రాగా అతనికి కాళ్ళు కడిగి భొజనం పెట్టి భర్త నిద్ర పోయేదాకా కాళ్ళు వత్తుతూ పతిసేవలో నిమగ్నమైంది.కౌశికుని కోపం అవధులు దాటి పోతున్నది.భర్త నిదురించగానే సుమతి ఒక పళ్ళెం నిండా భిక్ష తీసుకుని, కౌశికుని జోలెలో వేయటానికి రాగానే, కౌశికుడు నిప్పులు కురిసే కళ్ళతో ఆమెవంక చూసాడు. అతని చూపుకు సుమతి ఏమాత్రం భయపడ్డక, నేనేమీ చెట్టు మీద కాకిని కాదు. నీచూపుకు బూడిద కావటానికి అని పలికింది. కౌశికుడు ఆశ్చర్యంతో అడవిలో జరిగిన సంగతి ఈమెకెలా తెలిసిందా అనుకుని ఆమె పాదాలపైబడి తనకు ఙ్ఞానభిక్ష పెట్టమని అర్ధించాడు.తరువాత సుమతి ఏమని పలికిందో తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో...
మాతృదేవోభవ - పితృదేవోభవ (భాగం -1)
ఇది ప్రసిద్ధమైన పురాణగాధలో ఉన్న దివ్య కథ.పూర్వం ఒక అరణ్యం లో కౌశికుడు అనే మహర్షి తపస్సు చేసి, కొంత తపః శక్తి గడించాడు.అతను ఒకసారి ధ్యాన దీక్షలో ఒక వృక్షం క్రింద కూర్చొని ఉండగా, ఒక కాకి రెట్ట వేయటంతో ధ్యానభంగం కలిగి, దాని వంక కోపంగా చూసాడు.అతని కోపాగ్నికి ఆ కాకి విలవిలా తన్నుకుని మరణించింది.ఆ కౌశికుడు తన తపః శక్తికి గర్వపడుతూ భిక్ష కోసం ఆ రోజు ఒక ఇంటికి వెళ్ళి భవతీ భిక్షాం దేహి అని భిక్షకై కేకవేశాడు. ఆ ఇంటి ఇల్లాలి పేరు సుమతి.మహా పతివ్రత.కౌశికుని కేకవిని బయటకు వచ్చి స్వామి భిక్ష తెస్తానని లోపలికి వెళ్ళింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో...
Friday, February 27, 2009
పితృదేవోభవ
ఇప్పటి వరకూ మాతృదేవోభవ - మాతృమూర్తి గురించి కొంత తెలుసుకున్నాము.తరువాతి స్థానం పితృదేవోభవ - తండ్రిది. తండ్రి, తల్లి బిడ్డకు జన్మనిస్తే, తండ్రి పోషణ చేసి, విద్యాబుద్ధుల్ని నేర్పి,ఉన్నత వ్యక్తిగా బిడ్డను తీర్చిదిద్దుతాడు.అందుకనే తండ్రిని మన సమాజం తల్లి తరువాత స్థానంలో గౌరవించింది.తండ్రిమాట పాలించి, లోకానికి ఆరాధ్యుడైన శ్రీ శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడైనాడు.తండ్రి కైకకు ఇచ్చిన వరాలు నెరవేర్చటానికి,పదునారేండ్ల ప్రాయంలో వనవాసం చేసాడు.అంతేకానీ నీవు మాట ఇస్తే నేనెందుకు వనవాసం చేయాలి అనలేదు.తండ్రిమాట వేదవాక్కుగా భావించాడు.తరువాత భరతుడు వచ్చి నీ రాజ్యం నీవే పాలించాలి.నాకు అర్హత లేదు అని బ్రతిమిలాడినా,వారి వంశచరిత్రను సత్య వాక్య పాలనను గురించి వివరంగా బోధించి తనమాట మీదనే నిలబడి పితృవాక్యపాలనను గురించి వివరంగా బోధించి, తనమాట మీదనే నిలబడి పితృవాక్య పాలన చేసి దేవుడై మనందరి చేతా పూజించబడుతున్నాడు.కనుక ప్రతి బిడ్డ కూడా తల్లిని,తండ్రినీ గౌరవించి, వారిని ఆదరించి ప్రేమగా చూస్తే వారిని దేవుడు కూడా కరుణిస్తాడు.తల్లిని, తండ్రినీ సేవించి ముమ్మారు ప్రదక్షిణ చేసిన గణపతి తొలివేల్పుగా పూజలందుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే..!!ఇటువంటిదే మరొక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో...