Saturday, February 28, 2009

మాతృదేవోభవ -పితృదేవోభవ (భాగం -2)

మాతృదేవోభవ -పితృదేవోభవ

లోపలికి వెళ్ళిన సుమతి భిక్ష తెచ్చేంతలో ఆమె భర్త రాగా అతనికి కాళ్ళు కడిగి భొజనం పెట్టి భర్త నిద్ర పోయేదాకా కాళ్ళు వత్తుతూ పతిసేవలో నిమగ్నమైంది.కౌశికుని కోపం అవధులు దాటి పోతున్నది.భర్త నిదురించగానే సుమతి ఒక పళ్ళెం నిండా భిక్ష తీసుకుని, కౌశికుని జోలెలో వేయటానికి రాగానే, కౌశికుడు నిప్పులు కురిసే కళ్ళతో ఆమెవంక చూసాడు. అతని చూపుకు సుమతి ఏమాత్రం భయపడ్డక, నేనేమీ చెట్టు మీద కాకిని కాదు. నీచూపుకు బూడిద కావటానికి అని పలికింది. కౌశికుడు ఆశ్చర్యంతో అడవిలో జరిగిన సంగతి ఈమెకెలా తెలిసిందా అనుకుని ఆమె పాదాలపైబడి తనకు ఙ్ఞానభిక్ష పెట్టమని అర్ధించాడు.తరువాత సుమతి ఏమని పలికిందో తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో...

No comments:

Post a Comment