Saturday, February 28, 2009

మాతృదేవోభవ - పితృదేవోభవ (భాగం -1)

ఇది ప్రసిద్ధమైన పురాణగాధలో ఉన్న దివ్య కథ.పూర్వం ఒక అరణ్యం లో కౌశికుడు అనే మహర్షి తపస్సు చేసి, కొంత తపః శక్తి గడించాడు.అతను ఒకసారి ధ్యాన దీక్షలో ఒక వృక్షం క్రింద కూర్చొని ఉండగా, ఒక కాకి రెట్ట వేయటంతో ధ్యానభంగం కలిగి, దాని వంక కోపంగా చూసాడు.అతని కోపాగ్నికి ఆ కాకి విలవిలా తన్నుకుని మరణించింది.ఆ కౌశికుడు తన తపః శక్తికి గర్వపడుతూ భిక్ష కోసం ఆ రోజు ఒక ఇంటికి వెళ్ళి భవతీ భిక్షాం దేహి అని భిక్షకై కేకవేశాడు. ఆ ఇంటి ఇల్లాలి పేరు సుమతి.మహా పతివ్రత.కౌశికుని కేకవిని బయటకు వచ్చి స్వామి భిక్ష తెస్తానని లోపలికి వెళ్ళింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో...

No comments:

Post a Comment