Friday, December 12, 2008

సత్సంగ మహిమ~:విశ్వామిత్రుని సందేహం

సత్సంగ మహిమ~: విశ్వామిత్రుని సందేహం

సత్సంగం అనేది ఎంతో విలువైనది.దాని మహత్యం చెప్పనలవి కాదు.ఈ కలియుగం లో మానవులను ఎన్నో వ్యామోహాలు పట్టి పీడిస్తున్నాయి.ఈనాడు వృద్దులు కూడా మంచి విషయాలు తెలుసుకోవటానికి సిధ్దం గా ఉన్నా ఇంట్లో వ్యతిరేక ధోరణి ఉంటోంది.అటువంటిది ఇంకా యవ్వనం లో ఉన్నవాళ్ళు, చిన్నవాళ్ళకు మాత్రం దీని గురించి ఎలా తెలుస్తుంది???టి.వి.లో చెత్త సీరియల్స్, చెత్త కార్యక్రమాలు చూస్తూ మెదడును చెత్తకుండీగా చేసుకుంటున్నాం.కానీ ఒకసారైనా సత్సంగం గురించి మనందరం తెలుసుకుంటే కొంతలో కొంతైనా మంచిని అలవర్చుకోవటానికి దోహదపడుతుంది.అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఒకసారి విశ్వామిత్ర మహర్షికి ఒక సందేహం కలిగింది.అందరూ వశిష్ట మహర్షిని మాత్రమే ఎంతో గౌరవిస్తున్నారని, తనకు అంత గౌరవం లేదని అసూయ కలిగింది."నేను మాత్రం ఎందులో తక్కువ? తపోనిష్టుడనే కదా"??!!అని ఈ విషయమై మహర్షులను కలువగా, వారంతా ఆ ఆదిశేషుడే నీ ప్రశ్నకు సమాధానం చెప్పగలవాడని అన్నారు.విశ్వామిత్రుడు ఆదిశేషుని వద్దకు వెళ్ళాడు.ఆదిశేషుడు తల మీద భూభారం మోస్తున్నాడు.మరో ప్రక్క తన దేహమే పానుపుగా మలచి శ్రీలక్ష్మినారాయణనుకి కొలువుగా తీర్చాడు.అక్కడికి వచ్చిన విశ్వామిత్రుడు ఆదిశేషునికి అభివాదము చేసి,తన సందేహము అడిగాడు.నీవైనా వశిష్టుడు నాకంటే ఎందులో గొప్పవాడో చెప్పమని అడిగాడు.ఆ తరువాత ఏం జరిగిందో తదుపరి పోస్ట్ లో .....

No comments:

Post a Comment