Friday, December 12, 2008

సత్సంగ మహిమ ~: సత్పురుషుల సాన్నిహిత్య మహిమ

సత్సంగ మహిమ ~: సత్పురుషుల సాన్నిహిత్య మహిమ


విశ్వామిత్ర మహర్షి ఆలోచనలో పడతాడు..తాను ఎవరి దగ్గరైనా కల్మషం లేకుండా గడిపానా??. అని జ్ఞప్తికి తెచ్చుకుని, వశిష్ఠ మహర్షి పై విశ్వామిత్రునకు చాలా మత్సరం, అసూయ ఉండేవి.అందరూ ఆయనను "బ్రహ్మర్షి" అని, తనను "రాజర్షి" అని సంబోధిస్తారు. ఈ కోపంతో వశిష్ఠ మహర్షి యొక్క నూరు మంది కొడుకులను చంపాడు.అందువలన విశ్వామిత్రునకు బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకొని, పశ్చాత్తాపం తో, వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళి, తాను చేసిన పాపకార్యం చెప్పి, క్షమించమని వేడుకున్నాడు.వశిష్ఠ మహర్షి ఏమాత్రం కోపం లేనివాడై, ఈ విధంగా పలికాడు.

"మహర్షీ!! అన్నిటికీ అసూయే కారణం. అసూయను జయించలేకపోతే అన్నీ అనర్ధాలే". అని హితబోధ చేసి, విశ్వామిత్రుణ్ణి ఆదరించి క్షమించాడు. ఆయన దగ్గర తాను గడిపిన ఆ సమయం గుర్తుకు వచ్చి మనస్ఫూర్తిగా అహంకారం వదిలి ఆ పుణ్యఫలం ధారపోయగా భూమి పడిపోవటం ఆగిపోవటమే కాక, మరలా ఆదిశేషుని శిరస్సులపై భద్రంగా నిలిచింది.ఈ సంఘటనతో విశ్వామిత్రునకు ఙ్ఞానోదయం కలిగి తన ప్రశ్నకు సమాధానం దొరికింది.అంతేకాక తన తపః శక్తి అంతా కలిసినా వశిష్ఠ మహర్షి సమక్షంలో గడిపిన క్షణాల పుణ్యమే ఎక్కువ అని సత్సంగ మహిమ, విలువ కూడా తెలిసి అహంకారం తొలగింది.కనుక సత్ సాంగత్యం ఎంతటి పాపాన్నైనా దహించి మనసు నిర్మలమవ్వటమేకాక, మోక్షప్రాప్తికి కూడా సహకారిగా మారుతుంది.

No comments:

Post a Comment