Friday, December 12, 2008

సత్సంగ మహిమ ~: ఆదిశేషుడు-విశ్వామిత్రుని సంభాషణ

సత్సంగ మహిమ ~:

విశ్వామిత్రుని చూసిన ఆదిశేషుడు "మహర్షీ!! మీ ప్రశ్నకు ఇప్పుడు నేను సమాధానం చెప్పలేను.నా తల మీద భూ భారం ఉంది.నేను ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా భూమి ఒరిగి అల్లకల్లోలం అవుతుంది.ఈ భారం ఎవరైనా కాసేపు మోస్తే నీ ప్రశ్నకు బదులు చెప్పగలనని అన్నాడు".అది విని "విశ్వామిత్రుడు ఎవరిదాకా ఎందుకు??నా తపః శక్తి కొంచెం ధారపోసి భూమిని నిలబెడతాను.కిందకు దించు అన్నాడు".సరే అని ఆదిశేషుడు భూమిని శూన్యంలోకి దించగానే భూమి పడిపోనారంభించింది.వెంటనే విశ్వామిత్రుడు తన తపః శక్తి లో పావు వంతు ధారపోసి భూగోళాన్ని నిలబెట్టాలని చూచాడు.ఐనా ఆగలేదు..ఇంకా పడిపోతున్నది.ఈసారి సగం తపః శక్తిని ధారపోశాడు....ఐనా లాభం లేక పొయింది.చివరిగా తాను ఎన్నో వేల సంవత్సరాలు కష్టపడి సాధించిన తపఃశక్తి మొత్తం ధారపోసి భూగోళాన్ని నిలబెట్టాలని ప్రయత్నించాడు విశ్వామిత్రుడు.ఐనా ఫలితం శూన్యం.తరువాత ఏం చేయాలో పాలుపోక ఆలోచించసాగాడు.. తన మాటను నమ్మి భూభారాన్ని తనకు అప్పగించిన ఆదిశేషుని మోము వంక చూడటానికే వణుకుపుట్ట సాగింది విశ్వామిత్రునికి..భూమిని నిలబెట్టాలని చూసిన విశ్వామిత్రుని ప్రయత్నం సఫలం ఐనదో లేదో తెలుసుకుందాం.. తదుపరి పోస్ట్ లో.....


No comments:

Post a Comment