Saturday, November 15, 2008

సద్గురువు ను ఎలా తెలుసుకోవాలి?

ఓం శ్రీ సాయి నాధాయ నమః

సద్గురువు ను ఎలా తెలుసుకోవాలి??ఇప్పుడు మనకు కొన్ని సందేహాలు కలుగుతున్నాయి కదా!!మాకు దైవ భక్తి ఉంది.మేమంతా రొజూ మా ఇష్ట దైవాలకు పూజలు చేసుకుంటున్నాము..ఇంకా గురువు,సద్గురువు అంటూ అవసరమా??అని కొన్ని సందేహాలు కలుగుతాయి.కాని ఇక్కడే మనము కొంచెం వివేకము తో ప్రవర్తించాల్సిన అవసరము ఉంది. భగవానుడు ఐన శ్రీక్రృష్ణ భగవద్గీత లో ఇలా చెప్పారు."నన్ను గురించి ఆలోచించేవారు కొందరు.కోటికి కొంతమంది నన్ను పొందాలని ప్రయత్నించినా వారు నన్ను పొందలేరు.నా తత్వాన్ని అర్దం చేసుకోలేరు.అందుకనే దేవతలు,అంటూ చాలామందికి పూజలు చేస్తూ ఉంటారు".అని చెప్పారు.మరలా శ్రీక్రృష్ణ భగవానుడే అందరిలో నన్ను చూడగలిగేవారు అన్ని జీవులలో ,పండితులలో నన్ను దర్సించేవారు ,జ్ఞానులు అని చెప్పి ,అటువంటి సడ్గురువులకు తనకు బేధం లేదనీ చెప్పియున్నారు.అందుకోసమే తాను స్వయం గా భగవంతుడైనా కూడా తనను అందరూ అనుసరించుటకు గాను సందీపని మహర్షి వద్ద ఎంతో వినయము తో శిష్యుని గా మసలుకొని లోకానికి గురుశిష్య సంబంధం గురించి తెలియ పరిచారు.గురువు పట్ల శిష్యుడు ఎంత వినయ విధేయలతో మెలగి ఙ్నానం గ్రహించాలో శ్రీరామ ,శ్రీక్రృష్ణ అవతారాల లో బోధించారు.

No comments:

Post a Comment